News September 26, 2024
కడప:మహిళా పోలీస్ సిబ్బందికి ఉచిత క్యాన్సర్ పరీక్షలు

కడప జిల్లా పరిధిలోని మహిళా పోలీస్ సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏఆర్ అదనపు ఎస్పీ కృష్ణారావు బుధవారం పేర్కొన్నారు. స్క్రీనింగ్ ద్వారా వ్యాధి నిర్ధారణ అయితే అతి తక్కువ ఖర్చులోనే వైద్య సదుపాయాలు పొందే అవకాశం ఉంటుందని సూచించారు. పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యుల్లోని మహిళలు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News February 24, 2026
కడప: ఆహార కల్తీపై క్రిమినల్ కేసులు నమోదు: హరిత

ఆహార కల్తీపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ అధికారి హరిత హెచ్చరించారు. రాజమండ్రి కల్తీ పాల ఘటనతో మంగళవారం జిల్లాలో తనిఖీ చేపట్టినట్టు తెలిపారు. దాడులు కొనసాగుతాయన్నారు. పాల కేంద్రాలు, హోటళ్లు, టీ స్టాళ్లలో పాల శాంపిల్స్ సేకరించామన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని హలీం తయారీలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆహార తయారీలో టేస్టింగ్ సాల్ట్, కలర్స్ వాడకూడదన్నారు.
News February 24, 2026
కడప: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష.. 382 మంది గైర్హాజరు

ఇవాళ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 97 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మంగళవారం జిల్లాలో 62 కేంద్రాల్లో 15,159 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 14,777 మంది విద్యార్థులు హాజరయ్యారు. 382 మంది గైర్హాజరయ్యారు. ఇందులో 14,011 మంది జనరల్ విద్యార్థుల్లో 13,691 మంది హాజరవ్వగా.. 320 మంది గైర్హాజరయ్యారు. 1,148 మంది ఒకేషనల్ విద్యార్థుల్లో 1,086 మంది హాజరవ్వగా.. 62 మంది పరీక్షలు రాయలేదు.
News February 24, 2026
కడప: మొదటి రోజు పరీక్షలకు 748 మంది గైర్హాజరు

కడప జిల్లాలో సోమవారం ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలకు 96శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. 62 సెంటర్లలో 17,726 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 748 మంది గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థులు 16,392 మందికి గానూ, 15,789 మంది పరీక్షలు రాశారు. ఒకేషనల్ విద్యార్థులు 1,334 మందికిగాను, 1,189 మంది పరీక్షలకు వచ్చారు.


