News March 26, 2025

కడపలో ఎన్నిక వాయిదా వేయాలని పిటిషన్.. ఉత్కంఠ

image

ఉమ్మడి కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవికి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామా చేయడంతో రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ఎన్నికకు TDP పోటీ చేయమని చెప్పింది. పైగా YCPకి సంపూర్ణ మెజార్టీ ఉంది. ఈ తరుణంలో మరో ట్విస్ట్ నెలకొంది. ఎన్నికను వాయిదా వేయాలని గోపవరం ZPTC సభ్యుడు జయరామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై నేడు తీర్పు రానుండగా, గురువారం ఎన్నిక జరగాల్సి ఉంది. దీంతో జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.

Similar News

News November 9, 2025

బై పోల్.. ప్రచారానికి నేడే ఆఖరు

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార పర్వం నేటితో ముగియనుంది. సాయంత్రం 6 గంటలకు మైకులు, ప్రచార రథాలు మూగబోనున్నాయి. ప్రచార గడువు ముగియనుండటంతో ఆయా పార్టీల నేతలు తమ ప్రత్యర్థులపై పదునైన మాటల తూటాలు సంధిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు ఇవాళ సా.6 నుంచి ఈ నెల 11(పోలింగ్ తేదీ) సా.6 గంటల వరకు నియోజకవర్గంలో వైన్స్ మూసివేయాలని HYD సీపీ సజ్జనార్ ఆదేశించారు.

News November 9, 2025

13 ఏళ్లుగా HYDలో వేములవాడ రాజన్న కళ్యాణం

image

ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం శనివారం HYDలోని ఎన్టీఆర్ గార్డెన్స్‌లో అత్యంత వైభవంగా నిర్వహించారు. కోటి దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా గత 13 సంవత్సరాలుగా ఏటా రాజరాజేశ్వర స్వామి, అమ్మవార్ల కళ్యాణాన్ని హైదరాబాదులో ఘనంగా జరిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజన్న ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి కళ్యాణం కనులపండువగా సాగింది. ఆలయ ఈవో, CM పాల్గొన్నారు.

News November 9, 2025

కరీంనగర్: జాతీయ స్థాయికి ఒగ్గుడోలు విద్యార్థులు

image

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కళా ఉత్సవ్- 2025లో రాష్ట్రస్థాయిలో విజయం సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. పదో తరగతి చదువుతున్న రోహిత్, ఆశిష్, రిత్విక్, హర్షిత్ గ్రామీణ సాంప్రదాయ ఒగ్గుడోలు కళా ప్రదర్శనలో ప్రతిభ చాటారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.