News March 26, 2025

కడపలో ఎన్నిక వాయిదా వేయాలని పిటిషన్.. ఉత్కంఠ

image

ఉమ్మడి కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవికి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామా చేయడంతో రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ఎన్నికకు TDP పోటీ చేయమని చెప్పింది. పైగా YCPకి సంపూర్ణ మెజార్టీ ఉంది. ఈ తరుణంలో మరో ట్విస్ట్ నెలకొంది. ఎన్నికను వాయిదా వేయాలని గోపవరం ZPTC సభ్యుడు జయరామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై నేడు తీర్పు రానుండగా, గురువారం ఎన్నిక జరగాల్సి ఉంది. దీంతో జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.

Similar News

News October 20, 2025

విశాఖలో జరిగే సీఐఐ సదస్సులో పాల్గొనండి: నారా లోకేష్

image

ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్(AIBC) ప్రతినిధులతో న్యూసౌత్ వేల్స్ పార్లమెంట్ ఆవరణలో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల సాధించిన పెట్టుబడులను వివరించారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ సమ్మిట్‌లో పాల్గొనవలసిందిగా కోరారు.

News October 20, 2025

సీఎం రేవంత్‌తో కొండా సురేఖ దంపతుల భేటీ

image

TG: సీఎం రేవంత్‌ రెడ్డితో మంత్రి కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రెడ్డి వర్గమంతా కలిసి తమపై కుట్ర చేస్తున్నారంటూ సురేఖ కూతురు సుస్మిత ఇటీవల చేసిన <<18019826>>ఆరోపణలు<<>> సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

News October 20, 2025

గుంజేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

image

ముదిగుబ్బ మండలం గుంజేపల్లి చెరువుకట్ట సమీపాన సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. బుక్కపట్నం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన శేషు, కృష్ణ బైకుపై స్వగ్రామానికి వెళ్తూ జేసీబీని ఢీకొన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న 108 వాహనం అక్కడికి వెళ్లగా.. అప్పటికే వారు మృతి చెందారు. ముదిగుబ్బ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నట్లు సీఐ శివరాముడు తెలిపారు.