News May 26, 2024

కడప: అదుపు తప్పి బోల్తా పడ్డ ఆటో

image

పెండ్లిమర్రి మండల పరిధిలోని చీమలపెంట వద్ద వేంపల్లి నుంచి కడప వైపు వస్తున్న ఆటో అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ శ్రీనివాసులు, మశయ్య, సుబ్బమ్మ చిన్న చిన్న గాయాలతో బయట పడ్డారు. వీరంతా రంపతాడు గ్రామ స్థానికులు వాసులుగా గుర్తించారు. ప్రమాదంలో ఆటో ముందుభాగం పూర్తిగా దెబ్బతింది.

Similar News

News February 7, 2025

పులివెందుల: రాజహంస వాహనంపై శ్రీనివాసుడు

image

శ్రీ వెంకటరమణుడి బ్రహ్మోత్సవాలలో భాగంగా పులివెందులలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం రాత్రి రాజ హంస వాహనంపై సరస్వతీ రూపంలో శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి కాయ కర్పూరం సమర్పించి దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

News February 6, 2025

దస్తగిరి రెడ్డి ఫిర్యాదు.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

image

తనని జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్ జైలులో ఇబ్బంది పెట్టారని వైఎస్ వివేకానంద హత్య కేసులో అప్రూవర్‌ మారిన దస్తగిరి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. డాక్టర్ చైతన్య రెడ్డి తనకు రూ.20 కోట్లు ఆఫర్ చేశారని తెలిపారు. రేపు ఉదయం కడప జైలులో దస్తగిరి రెడ్డితో పాడు వారిద్దరినీ విచారణ అధికారి రాహుల్ ప్రశ్నించనున్నారు.

News February 6, 2025

కడప: నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు

image

బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని చౌదరి వారి పల్లి గ్రామంలో 25 మంది రైతులు నకిలీ వరి విత్తనాలతో మోసపోయారు. ఖాజీపేట మండలంలోని ఓ దుకాణంలో గత నెలలో వరి విత్తనాలు కొనుగోలు చేసి వరి పైరు సాగు చేశారు. 25 రోజులకే వరిలో వెన్ను రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నకిలీ విత్తనాల వల్లనే వరి పైరు ఇలా ముందే వెన్నుదశలోకి వెళ్లిందని బాధిత రైతులు గురివి రెడ్డి, పెద్ద వీరారెడ్డి వాపోయారు.

error: Content is protected !!