News April 9, 2024
కడప: ఈతకు వెళ్లి వ్యక్తి మృతి

కడప జిల్లాలో ఉగాది రోజు విషాదం నెలకొంది. వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట వద్ద ఈతకు వెళ్లిన వ్యక్తి మృతిచెందాడు. కడపకు చెందిన డేవిడ్ నలుగురు స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ఆనకట్ట వద్దకు వచ్చాడు. ఈత కొట్టే క్రమంలో నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు మృతదేహాన్ని వెలికి తీశారు. వల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News December 4, 2025
BREAKING: కడప మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

కడపలో ఖాళీగా ఉన్న మేయర్ స్థానానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నూతన మేయర్ను ఎన్నుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పూర్వపు మేయర్ సురేశ్ బాబుపై ప్రభుత్వం అనర్హత వేటు వేయడంతో ఇన్ఛార్జ్ మేయర్గా ముంతాజ్ కొనసాగుతున్నారు. కడపలో మొత్తం 50 వార్డులు ఉన్నాయి.
News December 4, 2025
కడప జిల్లాలో రియల్ ఎస్టేట్ ఢమాల్.!

కడప జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గింది. జిల్లాలో 12 SROలు ఉన్నాయి. వీటి ద్వారా 2025-26లో రూ.411.74 కోట్లు టార్గెట్ కాగా.. నవంబరు నాటికి రూ.181.73 కోట్లు మాత్రమే వచ్చింది. బద్వేల్-9.48, జమ్మలమడుగు-10.37, కమలాపురం-8.60, ప్రొద్దుటూరు-40.47, మైదుకూరు-7.10, ముద్దనూరు-3.44, పులివెందుల-11.96, సిద్దవటం-2.45, వేంపల్లె-6.14, దువ్వూరు-2.55, కడప-79.13 కోట్లు వచ్చింది.
News December 4, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు..!

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.12765.00
☛ బంగారం 22 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.11744.00
☛ వెండి 10గ్రాములు రేట్: రూ.1760.00


