News May 21, 2024
కడప: ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాతో పాటు 46 మందిపై కేసు

ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదైంది. కడప గౌస్ నగర్లో జరిగిన అల్లర్ల ఘటనలో టూటౌన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అంజద్ బాషాతో పాటు 21 మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డితో పాటు 24 మంది టీడీపీ కార్యకర్తలపైనా కేసులు నమోదు చేసినట్లు
పేర్కొన్నారు.
Similar News
News October 26, 2025
జమ్మలమడుగులో భార్యాభర్తలు దారుణ హత్య

జమ్మలమడుగు- తాడిపత్రి రహదారిలో శ్రీకృష్ణ మందిరం సమీపంలో ఇటికల బట్టి వద్ద కాపలాగా ఉన్న నాగప్ప పెద్దక్క అనే దంపతులపై శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. దాడులు చేయడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఆ ఇంట్లో ఉన్న వస్తువులను చోరీ చేశారు. ఇది దొంగల పనేనని స్థానికులు అంటున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 26, 2025
కడప జిల్లా ప్రజలకు గమనిక

కడప జిల్లాలో వాతావరణ పరిస్థితి దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేసినట్లు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఆదితి సింగ్ ఆదివారం తెలిపారు. విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు. జిల్లా ప్రజలు తమ ఫిర్యాదులు ఏమైనా ఉంటే వాటిని వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని కోరారు. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
News October 26, 2025
రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

కడప జిల్లాలో అధిక వర్షపాతం కృషి అవకాశం ఉన్నందున సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి రాకూడదని తెలిపారు. వృద్ధులు మహిళలు వికలాంగులు రావద్దని అన్నారు.


