News July 21, 2024
కడప: ఎంఈవో, టీచర్లపై కేసు నమోదు

కడప నగరంలోని డీఈవో కార్యాలయంపై దాడి ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 2 రోజుల క్రితం పాత ఆర్జేడిపై జరుగుతున్న విచారణకు ఆటంకం కలిగించేలా ఐదుగురు ఘర్షణకు దిగి దాడి చేసి తన సెల్ఫోన్ పగలగొట్టారని ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సుండుపల్లి ఎంఈవో వెంకటేశ్ నాయక్, ఉపాధ్యాయులు ఆదినారాయణ రెడ్డి, నాగమణి రెడ్డి, శివకుమార్ రెడ్డి, రామకృష్ణలపై కేసు నమోదు చేశారు.
Similar News
News November 11, 2025
కడప విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష

సీఎం చంద్రబాబు చిన్నమండెం పర్యటన నేపథ్యంలో కడప విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లపై జిల్లా SP షెల్కే నచికేత్ విశ్వనాథ్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఎయిర్పోర్ట్లో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (A.S.L) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా SP పోలీసు శాఖతోపాటు ఇతర విభాగాల అధికారులకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.
News November 10, 2025
కడప శ్రీ చైతన్యలో విద్యార్థిని ఆత్మహత్య

కడప శ్రీ చైతన్య బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో తొమ్మిదో తరగతి బాలిక జస్వంతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని పులివెందుల వాసిగా సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 10, 2025
ఎర్రగుంట్లలోని ఆలయంలో హీరో సుమన్ సందడి

ఎర్రగుంట్ల (M) కలమల్ల గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో సినీ హీరో సుమన్ సందడి చేశారు. అక్కడ ఉన్న పురాతన తొలి తెలుగు శాసనాన్ని పరిశీలించారు. తెలుగు శాసనాన్ని కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ఆలయాధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.


