News July 21, 2024

కడప: ఎంఈవో, టీచర్లపై కేసు నమోదు

image

కడప నగరంలోని డీఈవో కార్యాలయంపై దాడి ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 2 రోజుల క్రితం పాత ఆర్జేడిపై జరుగుతున్న విచారణకు ఆటంకం కలిగించేలా ఐదుగురు ఘర్షణకు దిగి దాడి చేసి తన సెల్ఫోన్ పగలగొట్టారని ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సుండుపల్లి ఎంఈవో వెంకటేశ్ నాయక్, ఉపాధ్యాయులు ఆదినారాయణ రెడ్డి, నాగమణి రెడ్డి, శివకుమార్ రెడ్డి, రామకృష్ణలపై కేసు నమోదు చేశారు.

Similar News

News November 26, 2025

కడప జిల్లాలో 201 మంది హౌసింగ్ ఉద్యోగులకు జీతాలు నిలిపివేత

image

కడప జిల్లాలో 201 మంది హౌసింగ్ ఉద్యోగులకు నవంబర్ నెల జీతాలు నిలిపివేస్తూ ఆ శాఖ ఎండీ అరుణ్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో ‘ఫేజ్-3’లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లోని లోపాలపై ఇటీవల పరిశీలన చేపట్టారు. ఈ నివేదిక ఆధారంగా జిల్లాలో 6,298 ఇళ్ల నిర్మాణాలకు అదనపు చెల్లింపు జరిగినట్లు గుర్తించారు. ఇందుకు 30 మంది ఏఈఎస్‌లు, 171 మంది ఈఏ/డబ్ల్యూఏఎస్‌లను బాధ్యులను చేస్తూ ఈ చర్యలు తీసుకున్నారు.

News November 26, 2025

కన్నీటి నివాళి: ‘అమ్మే మా వెన్నెముక’

image

కుటుంబానికి వెన్నెముకగా, జీవితానికి వెలుగుగా నిలిచిన <<18391262>>అమ్మ<<>> రత్నమ్మ (83) ఇక లేరనే నిజాన్ని అంగీకరించడం భారంగా ఉందని ఎంపీ సీఎం రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ప్రేమ, త్యాగం, ఆప్యాయత మాటలతో చెప్పలేనంత గొప్పవని అన్నారు. అమ్మ లేకపోవడం మాటల్లో చెప్పలేని పెద్ద లోటుగా మిగిలిందని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.

News November 26, 2025

ఎంపీ సీఎం రమేశ్ తల్లి మృతి

image

అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తల్లి చింతకుంట రత్నమ్మ (83) మృతిచెందారు. బుధవారం తెల్లవారుజామున 3.39 గంటలకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కడప జిల్లా పొట్లదుర్తి గ్రామంలో రేపు ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.