News December 6, 2024

కడప: ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు.. కానీ.!

image

రోడ్డు ప్రమాదం జరిగితే 108 వాహనం రయ్ రయ్ మంటూ వచ్చి వారిని త్వరగా ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడుతుంటారు. కానీ.. గురువారం గువ్వలచెరువు ఘాట్‌లో బ్రహ్మంగారి మఠానికి చెందిన 108 డ్రైవర్ రమేశ్ మృతి చెందాడు. ఆయన మృతిని చూసిన వారు రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మందిని రక్షించిన వ్యక్తి ఇవాళ అదే రోడ్డు ప్రమాదానికి గురై మరణించడం బాధాకరమని పేర్కొంటున్నారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు.

Similar News

News November 26, 2025

కడప: హౌసింగ్ అక్రమాల్లో చిన్న ఉద్యోగులు బలి.!

image

గత ప్రభుత్వంలో జిల్లాలో జరిగిన ఇళ్ల నిర్మాణాల్లో కింది స్థాయి ఉద్యోగులను మాత్రమే బలి చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 6298 ఇళ్ల నిర్మాణాల అక్రమాలపై 201 మంది సచివాలయ, మండల స్థాయి ఉద్యోగులకు జీతాలు నిలిపి వేశారు. బిల్లుల చెల్లింపులో DEE, EE, PD, SE, CE, MD స్థాయిలో ప్రతిచోట పరిశీలన జరుగుతోంది. నిర్మాణాలు పరిశీలించకుండానే అధికారులు ఏవిధంగా చెల్లింపులు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

News November 26, 2025

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్ సంతకం

image

రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేశారు. పులివెందుల పర్యటనలో ఉన్న ఆయన బుధవారం కోటి సంతకాల సేకరణ ఫారంపై సంతకం చేసి తన వ్యతిరేకతను తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వైకాపా ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

News November 26, 2025

ప్రొద్దుటూరులో బంగారు ధరలు ఇలా..

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బంగారు ధరలు బుధవారం ఇలా ఉన్నాయి.
* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.12,590
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.11,583
* వెండి 10 గ్రాములు ధర రూ.1,630 గా ఉంది.
నిన్న, ఈరోజుకి బంగారు ధరలో ఎలాంటి మార్పు లేదు. కానీ నిన్న వెండి 10 గ్రాములు రూ.1,616 ఉండగా నేడు రూ.1630లకు పెరిగింది.