News November 27, 2024
కడప ఎస్పీకి జేసీ లేఖ.. నేడు ఏం జరగనుంది?

జమ్మలమడుగు MLA ఆదినారాయణరెడ్డి సోదరుడి కుమారుడు భూపేశ్ రెడ్డిని JC ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ఆర్టీపీపీ నుంచి ఫ్లైయాష్ తరలింపు విషయంలో అడ్డంకులు సృష్టిస్తే సహించేది లేదని తెలిపారు. ఈ మేరకు కడప ఎస్పీకి లేఖ రాశారు. నేటి నుంచి తమ వాహనాలు లోడింగ్కు వెళ్తాయని, ఆపితే తేలిగ్గా తీసుకోమని అన్నారు. 1932 నుంచి రాజకీయాల్లో ఉన్నామని, తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తే దేనికైనా సిద్ధమేనని లేఖలో పేర్కొన్నారు.
Similar News
News November 16, 2025
కడప జిల్లాలో పలువురు సీఐల బదిలీలు.!

కడప జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ DIG కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. పోరుమామిళ్ల CI శ్రీనివాసులను రైల్వే కోడూరుకు, రైల్వే కోడూరు CI హేమసుందర్ రావును పోరుమామిళ్లకు బదిలీ చేశారు. ఒంటిమిట్ట CI బాబును అన్నమయ్య జిల్లాకు, చిత్తూరు VRలో ఉన్న నరసింహరాజు ఒంటిమిట్టకు బదిలీ అయ్యారు. ట్రాఫిక్ CI జావేద్ కడప జిల్లా సైబర్ క్రైమ్ సీఐగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో సురేశ్ రెడ్డి రానున్నారు.
News November 16, 2025
రేపు కడప కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

కడప నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఉంటుందని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. ఉదయం జరిగే కార్యక్రమానికి కలెక్టర్ శ్రీధర్, జాయింట్ అధితి సింగ్తో సహా జిల్లాలోని ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. అర్జీ దారులు తమ సమస్యలను ఉన్నతాధికారాల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు.
News November 15, 2025
పంటల రక్షణకు IOT సాంకేతికత అవసరం: కలెక్టర్

కడప కలెక్టరేట్లో మైక్రో ఇరిగేషన్, ఉద్యాన పంటల సస్యరక్షణపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ సమీక్ష నిర్వహించారు. వాతావరణ మార్పుల పర్యవేక్షణకు నూతన సాంకేతిక పరిజ్ఞానం మేళవింపు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. క్రాపిన్, ఫసల్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. ఐఓటీ ఆధారిత స్మార్ట్ వ్యవసాయ పరికరాల ప్రయోజనాలను తెలుసుకున్నారు. ఈ టెక్నాలజీ నీటి సమర్థతను, దిగుబడిని పెంచి, వ్యాధుల ముందస్తు హెచ్చరికలు ఇస్తుందన్నారు.


