News April 28, 2024
కడప: ‘ఓటు హక్కు.. ప్రతి ఒక్కరి ఆయుధం’

ప్రజాస్వామ్య దేశంలో విలువైన ఓటుహక్కును వినియోగించుకోవడం పౌరులుగా మన బాధ్యతని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటుహక్కును సద్వినియోగించుకోవాలని కడప నగర కమీషనర్ ప్రవీణ్ చంద్ అన్నారు. “మన ఓటు, మన ధైర్యం, మన భవిత” అన్న నినాదంతో కడప రాజీవ్ పార్క్ వద్ద నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కమిషనర్ ప్రారంభించి ఆయన పాల్గొన్నారు. ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు.
Similar News
News April 18, 2026
పులివెందుల టీడీపీలో వర్గపోరు?

పులివెందుల టీడీపీలో వర్గపోరు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, ఇన్ఛార్జ్ బీటెక్ రవి అంటీఅంటనట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం. అంతే కాకుండా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథిరెడ్డి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వూలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని ఉద్దేశిస్తూ కోవర్టు అని వ్యాఖ్యానించారు. ప్రధాన నేతల మధ్యే సఖ్యత లేకపోతే ఎలా అని కార్యకర్తలు భావిస్తున్నారు.
News April 18, 2026
కడప జిల్లా వ్యాప్తంగా 273 కేసులు

కడప జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం పోలీస్ అధికారులు వాహనాల తనిఖీ ముమ్మరంగా చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని 273 మందిపై కేసులు నమోదు చేసి, రూ.78,040 జరిమానా విధించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని వాహనదారులకు సూచించారు.
News April 18, 2026
ఎర్రగుంట్ల: అంత్యక్రియలను అడ్డుకున్నారు.. కారణం ఏంటంటే.!

ఎర్రగుంట్ల(M) పొట్లదుర్తిలో అంత్యక్రియలను కొందరు అడ్డుకున్నారు. నరసింహులు అనే వ్యక్తి మృతి చెందడంతో బంధువులు అంత్యక్రియలు చేపట్టేందుకు శ్మశానవాటికు వెళ్లారు. ఆలయ నిర్వాహకులు ఈ స్థలం దేవాలయందని ఇక్కడ శవాన్ని పూడ్చడానికి వీలులేదని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న సీఐ, ఎమ్మార్వో ఘటనా స్థలానికి చేరుకొని రికార్డులను పరిశీలించి స్థలం దేవాలయందని తేల్చారు. దీంతో అంత్యక్రియలు మరో ప్రాంతంలో నిర్వహించారు.


