News February 17, 2025
కడప కలెక్టరేట్ ప్రజా ఫిర్యాదు పరిష్కార వేదిక

ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కడప కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేడుక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. అందులో భాగంగా ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యక్రమం ఉంటుందన్నారు. ఆ తర్వాత సభా భవనంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరిస్తారని పేర్కొన్నారు. కలెక్టరేట్తో పాటు అన్ని మండలాలు మున్సిపల్ కార్యాలయంలో కూడా ప్రజల అర్జీలను స్వీకరిస్తారని ఆయన పేర్కొన్నారు.
Similar News
News March 24, 2025
ఎర్రగుంట్ల: మోసాల్లో ఇదో కొత్త రకం

బంధువని చెప్పి మాటల్లో పెట్టి మోసంచేసే కేటుగాడిని ఎర్రగుంట్ల పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. ఖాజీపేటకు చెందిన ఖాసీంపీరా చెడు వ్యసనాలకు బానిసై అప్పులుచేసి, అవి తీర్చడానికి అడ్డదారులు ఎంచుకున్నాడు. ఈనెల 9న ఎర్రగుంట్లలో మహబూబీ అనే వృద్ధురాలిని బంధువని నమ్మించాడు. ‘తన కూతురి పెళ్లికి రావాలని, మీ చేతికి ఉన్న ఉంగరం లాంటిది చేయిస్తానని చెప్పి, ఇవ్వాలని తీసుకొని’ ఉడాయించాడు.
News March 24, 2025
కడప: యథావిధిగా ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ’

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను సోమవారం కడప కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. జిల్లా అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు ఉంటుందని తెలిపారు.
News March 23, 2025
సిద్దవటం: పూరిల్లు దగ్ధం.. వృద్ధుడు సజీవ దహనం

సిద్దవటం మండలంలోని మూలపల్లిలో పూరిల్లు దగ్ధం కావడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. అయ్యవారి రెడ్డి స్వామి సమీపంలోని సత్రం వద్ద ఆదివారం పూరి ఇంట్లో ఉన్న పిల్లి రాజారెడ్డి(75) వృద్ధుడికి కంటి చూపు కనపడదన్నారు. కట్టెల పొయ్యి మీద అన్నం చేస్తుండగా ప్రమాదవ శాత్తు పూరింటికి మంటలు అంటుకొని అగ్నికి ఆహుతయ్యాడన్నారు. ఒంటిమిట్ట సీఐ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.