News August 29, 2024
కడప: కాలేజీలో ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్య

ఖాజీపేట మండలం అప్పనపల్లికి చెందిన ప్రవీణ్ కాలేజీలో ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కలికిరిలోని JNTUలో బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి ప్రవీణ్ ర్యాగింగ్కు గురయ్యాడు. మనస్థాపన చెంది ఈనెల 23న ఇంటికి వచ్చాడు. ఈక్రమంలో తన బాధను ఇంట్లో చెప్పుకోలేక 26న పురుగు మందును తాగాడు. గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అందుతుండగా ఇవాళ ఉదయం మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు.
Similar News
News November 17, 2025
కడప: ‘మహిళలు ఉపాధి శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి’

కడపలోని కెనరా బ్యాంక్ శిక్షణ శిబిరం నందు నిర్వహించే శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి అని సంస్థ డైరెక్టర్ ఆరిఫ్ పేర్కొన్నారు. నవంబర్ 17వ తేదీ నుంచి 45 రోజుల పాటు మహిళలకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు. టైలరింగ్, బ్యూటీ పార్లర్ విభాగాలలో శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు.
News November 17, 2025
ప్రొద్దుటూరు అంటే భయపడుతున్న అధికారులు..?

ప్రొద్దుటూరులో పనిచేయాలంటే అధికారులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పనిచేసిన 43మంది అధికారులపై ఇప్పుడు విచారణకు ఆదేశించారు. ఇక్కడి హౌసింగ్ శాఖలోని నలుగురు సిబ్బందిపై క్రిమినల్ చర్యలకు ఆదేశించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు ఇక్కడి అధికారులను ఇష్టారీతిగా వాడుకుంటున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారినప్పుడల్లా ఆ అధికారులు ఇబ్బంది పడుతున్నారు.
News November 17, 2025
19న కడప జిల్లాకు సీఎం చంద్రబాబు..?

సీఎం చంద్రబాబు ఈనెల 19న కడప జిల్లాకు వస్తారని సమాచారం. కమలాపురం నియోజకవర్గ పరిధిలోని పెండ్లిమర్రి మండలంలో ఆయన రైతులతో సమావేశమవుతారు. పీఎం కిసాన్ నిధుల విడుదల తర్వాత క్షేత్రస్థాయిలో పొలాలను పరిశీలిస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నేడు లేదా రేపు అధికారికంగా షెడ్యూల్ రానుంది.


