News March 29, 2024
కడప కూటమి ఎంపీ అభ్యర్థిగా భూపేశ్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీ కూటమి కడప పార్లమెంట్ అభ్యర్థిగా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన భూపేశ్ రెడ్డిని ఎంపిక చేశారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కాసేపటి క్రితం జాబితాను విడుదల చేసింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ ఆశించగా కూటమిలో భాగంగా బీజేపీకి కేటాయించడంతో భూపేశ్కు కడప ఎంపీ స్థానాన్ని ఇచ్చారు. భూపేశ్ విజయానికి కడప పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల కార్యకర్తలు పని చేయాలని సూచించారు.
Similar News
News April 5, 2026
నేడు ఒంటిమిట్ట రామయ్యకు పుష్పయాగం

ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ముగియడంతో నేడు(ఆదివారం) రాత్రి రామాలయంలో వేదపండితులు, అర్చకులు సంప్రదాయంగా పుష్పయాగం, ఏకాంతసేవ నిర్వహించనున్నారు. ఆలయంలోని దక్షిణ ఈశాన్య మూల ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి, వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన ప్రత్యేక చినపుష్పాలతో ఈ కార్యక్రమాన్ని వేడుకగా జరిపించనున్నారు.
News April 5, 2026
ప్రొద్దుటూరు శివాలయం ఇంటి దొంగలపై విచారణ!

ప్రొద్దుటూరు అగస్త్యేశ్వరాలయం (శివాలయం) ఇంటి దొంగలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అమ్మవారి బంగారు హారం, స్వామివారి వెండి వస్తువులు, సుమారు రూ. కోటి డబ్బులు మాయమయ్యాయి. వీటిపై ఎండోమెంట్ కర్నూల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం సూపరింటెండెంట్ తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో ఏడు మంది అధికారుల బృందాన్ని విచారణకు నియమించారు. వీరు సోమవారం విచారణకు వస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ నారాయణరెడ్డి తెలిపారు.
News April 5, 2026
ప్రొద్దుటూరు శివాలయం ఇంటి దొంగలపై విచారణ!

ప్రొద్దుటూరు అగస్త్యేశ్వరాలయం (శివాలయం) ఇంటి దొంగలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అమ్మవారి బంగారు హారం, స్వామివారి వెండి వస్తువులు, సుమారు రూ. కోటి డబ్బులు మాయమయ్యాయి. వీటిపై ఎండోమెంట్ కర్నూల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం సూపరింటెండెంట్ తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో ఏడు మంది అధికారుల బృందాన్ని విచారణకు నియమించారు. వీరు సోమవారం విచారణకు వస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ నారాయణరెడ్డి తెలిపారు.


