News March 29, 2024
కడప కూటమి ఎంపీ అభ్యర్థిగా భూపేశ్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీ కూటమి కడప పార్లమెంట్ అభ్యర్థిగా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన భూపేశ్ రెడ్డిని ఎంపిక చేశారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కాసేపటి క్రితం జాబితాను విడుదల చేసింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ ఆశించగా కూటమిలో భాగంగా బీజేపీకి కేటాయించడంతో భూపేశ్కు కడప ఎంపీ స్థానాన్ని ఇచ్చారు. భూపేశ్ విజయానికి కడప పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల కార్యకర్తలు పని చేయాలని సూచించారు.
Similar News
News December 24, 2025
పులివెందులలో ఇవాళ జగన్ పర్యటన వివరాలు

మాజీ సీఎం జగన్ ఇవాళ్టి పర్యటన వివరాలను వైసీపీ వర్గాలు బుధవారం తెలిపాయి. ఉదయం 9:30కు పులివెందుల నుంచి బయలుదేరి 10:30కి ఇడుపులపాయ ప్రార్థనా మందిరానికి చేరుకుంటారు. అక్కడ 1:00 గంట వరకు ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 2 గంటలకు పులివెందుల క్యాంపు కార్యాలయానికి చేరుకొని రాత్రి 7 గంటల వరకు ప్రజలను కలుస్తారు. అనంతరం నివాసానికి వెళతారు.
News December 24, 2025
మాజీ సీఎం జగన్ను కలిసిన జిల్లా ముఖ్య నాయకులు

మూడు రోజుల కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ జిల్లాలోని ముఖ్య నాయకులు కలిశారు. పులివెందులలోని ఆయన నివాసంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు దాసరి సుధా, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డితో పాటు జిల్లాలోని ముఖ్య నాయకులు కలిశారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికలలో వైసీపీ బలోపేతానికి కృషి చేయాలంటూ నాయకులకు సూచించారు.
News December 24, 2025
కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్ ఫొటో

క్రిస్మస్ పండుగ సందర్భంగా పులివెందులకు వచ్చిన వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటో విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఫొటోను ఆయన అభిమానులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఫొటోలో విజయమ్మ, దివ్యారెడ్డి, భారతి రెడ్డి తదితర కుటుంబ సభ్యులు ఉన్నారు.


