News January 2, 2025

కడప: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌కు ఘన స్వాగతం

image

కడప జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించేందుకు వచ్చిన కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌కు అధికారులు ఘన స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయంలో కడప ఆర్డీవో జాన్ ఏర్విన్ కేంద్ర మంత్రికి  పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో కడపకు బయలుదేరారు. నేటి నుంచి జిల్లాలో పర్యటించనున్నారు.

Similar News

News January 26, 2025

కడప డీటీసీ చంద్రశేఖర్‌పై సస్పెన్షన్ వేటు

image

కడప రవాణా శాఖ కార్యాలయంలో మహిళా అధికారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన జిల్లా రవాణా శాఖ అధికారి చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. శాఖపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో విచారించిన అధికారులు అతని తప్పు ఉందని తెలియడంతో అతడిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహిళా అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఇప్పటికే మంత్రి మండిపల్లి స్పష్టం చేశారు.

News January 26, 2025

కడప: బస్సులో పొగలు.. ఆగిన బస్సు

image

తిరుపతి నుంచి ఆదోని వెళ్తున్న RTC సూపర్ లగ్జరీ బస్సు తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో వల్లూరు సమీపంలో ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సు వెనుక వైపున పొగ రావడం గమనించిన ప్రయాణికులు డ్రైవర్‌కు తెలిపారు. టెక్నికల్ సమస్యతో బస్సు ముందుకు కదలకపోవడంతో ప్రత్యామ్నాయంగా వేరే బస్సులో ఎక్కించి పంపించారు. దూర ప్రయాణాలు చేసే బస్సుల కండిషన్ సరిగా లేకపోవడం పట్ల ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.

News January 26, 2025

చెక్ పోస్టుల్లో కట్టుదిట్టంగా తనిఖీలు నిర్వహించాలి: ఎస్పీ

image

కడప జిల్లాలోని అన్ని చెక్ పోస్టుల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. గంజాయి, అక్రమ మద్యం, నిషేదిత పదార్థాలు, ఇతర వస్తువుల అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని పేర్కొన్నారు. శుక్రవారం అర్ధరాత్రి దువ్వూరు పీఎస్ పరిధిలోని ఇడమడక అంతర్ జిల్లా చెక్ పోస్ట్‌ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.