News July 30, 2024

కడప: ‘గంజాయి నిర్మూలనపై దృష్టి సారించాలి’

image

కడప జిల్లాలో గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర హోం మంత్రి అనిత సూచించారు. వైజాగ్ నుంచి హోంమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కడప ఎస్పీ కార్యాలయం నుంచి ఎస్పీ హర్షవర్ధన్ రాజు హాజరయ్యారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గంజాయి నిర్మూలనే లక్ష్యంగా రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుకు, గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News October 29, 2025

పుష్పగిరిలో జైనమత ఆనవాళ్లు

image

పుష్పగిరిలో 10 శతాబ్దం నాటి జైన పాదుకలు వెలుగు చూశాయి. జిల్లాకు చెందిన రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి తాజాగా ఈ జైన పాదుకలను గుర్తించారు. పుష్పగిరిలో వైష్ణవ, శైవ, వీరశైవ, శాక్తేయ, అఘోర, కాపాళిక మత శాఖలకు సంబంధించిన ఆలయాలకు, చారిత్రక ఆనవాళ్లకు నిలయంగా పెర్కొనబడుతోంది. తాజాగా జైన పాదుకల ఆవిష్కరణతో పుష్పగిరి మత సాంస్కృతిక చరిత్రకు జైనమత ఆనవాళ్లు కూడా తోడయ్యాయని ఆయన తెలిపారు.

News October 29, 2025

కడప జిల్లాలోని కాలేజీలకు కూడా ఇవాళ సెలవు

image

కడప జిల్లాపై తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నిన్న జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు బుధవారం సైతం సెలవు ఇస్తున్నామని డీఈవో శంషుద్దీన్ ఓ ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఇవాళ కాలేజీలకు కూడా సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 28, 2025

అప్రమత్తతతో సహాయక చర్యలపై దృష్టి సారించండి: కలెక్టర్

image

మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి మట్టంపై అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కడప కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. తుఫాను వర్షాల పరిస్థితులను ఎదుర్కొనే సహాయక చర్యలు, సంసిద్ధతపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.