News January 26, 2025
కడప: చాక్ పీస్పై జాతీయ జెండా

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కడప నగరానికి చెందిన ఓ యువకుడు తన ప్రతిభను చాటాడు. చాక్ పీస్పై జాతీయ జెండాను రూపొందించి తనలో ఉన్న ప్రతిభను చాటి చెప్పాడు. కడప నగరం చిన్నచౌక్ ప్రాంతానికి చెందిన సాయి చరణ్ క్యూబిక్లో ప్రతిభతో పాటు పెన్సిల్, చాక్ పీస్పై వివిధ రకాల ఆర్ట్ వేస్తూ అబ్బుర పరుస్తూ ఉంటాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చాక్ పీస్పై ఆర్ట్ వేయడంతో పలువురు అభినందిస్తున్నారు.
Similar News
News November 18, 2025
పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ను పూర్తి చేయాలి: కడప కలెక్టర్

కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఈఆర్వోలను ఆదేశించారు. సోమవారం ప్రత్యేక సమగ్ర సవరణ-2026పై రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న 1963 కేంద్రాలకు అదనంగా 158 కొత్త కేంద్రాలకు ప్రతిపాదనలు వచ్చాయని, దీనితో మొత్తం 2121 కేంద్రాలు అవుతాయని తెలిపారు. ఒకే కుటుంబం సభ్యులు ఒకే కేంద్రంలో ఉండేలా చూడాలన్నారు.
News November 18, 2025
పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ను పూర్తి చేయాలి: కడప కలెక్టర్

కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఈఆర్వోలను ఆదేశించారు. సోమవారం ప్రత్యేక సమగ్ర సవరణ-2026పై రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న 1963 కేంద్రాలకు అదనంగా 158 కొత్త కేంద్రాలకు ప్రతిపాదనలు వచ్చాయని, దీనితో మొత్తం 2121 కేంద్రాలు అవుతాయని తెలిపారు. ఒకే కుటుంబం సభ్యులు ఒకే కేంద్రంలో ఉండేలా చూడాలన్నారు.
News November 17, 2025
మైదుకూరు ఎమ్మెల్యే కేసులో నిందితుల అరెస్ట్

మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ను బెదిరించిన ఏడుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు ఎమ్మెల్యేను బెదిరించి రూ.1.70 కోట్లు కాజేశారు. తాజాగా ఈ కేసులోని నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఢిల్లీకి చెందిన ఐడీఎఫ్సీ బ్యాంక్ మేనేజర్ కూడా ఉండడం గమనార్హం.


