News September 5, 2024
కడప: చింతకుంటలో కుంగిన భూమి

వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం చింతకుంటలో వ్యవసాయ భూమి బుధవారం సుమారు 6 అడుగుల లోతు కుంగిపోయింది. ఉదయాన్నే పొలం దగ్గరకు రైతు మాను కొండు శివ కుంగిన భూమిని చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి పంట వేయలేదు. 2019లోనూ ఇదే భూమి కుంగిందని, అప్పట్లో దాన్ని పూడ్చేందుకు రూ. 50 వేలు వెచ్చించినట్లు బాధిత రైతు తెలిపారు. అధికారులు దీనిని పరిశీలించాలని కోరుతున్నాడు.
Similar News
News December 8, 2025
కడప జిల్లాలో e-Shramలో నమోదు చేసుకున్న 3.80 లక్షల మంది

కడప జిల్లాకు చెందిన 3.80 లక్షల మంది శ్రామికులు తమ పేర్లను కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన e-Shram పోర్టల్లో నమోదు చేసుకున్నారు. 42.76% పురుషులు, 57.23% మహిళలు నమోదు చేసుకున్నారు. 18-40 వయస్సు వారు 45.2%, 40-50 వయస్సు వారు 30.27%, 50+ వయస్సు వారు 24.47% మంది చేసుకున్నారు. అసంఘటిత రంగంలోని భవన నిర్మాణ, వ్యవసాయ, ఇతర రంగాల్లోని కార్మికులు ప్రభుత్వ పథకాల కోసం నమోదు చేసుకున్నారు.
News December 8, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం వెండి ధరలు:

ప్రొద్దుటూరులో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు:
☞ బంగారం 24 క్యారెట్ ఒక గ్రాము ధర: రూ.12775
☞ బంగారం 22 క్యారెట్ ఒక గ్రాము ధర: రూ.11753
☞వెండి 10 గ్రాముల ధర: రూ.1780
News December 8, 2025
కడపకు చేరుకున్న రాష్ట్ర హోంమంత్రి అనిత

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కడపకు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్లో ఆమెకు SP నచికేత్ విశ్వనాథ్ స్వాగతం పలికారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఆమె జిల్లాకు వచ్చినట్లు సమాచారం.


