News July 1, 2024

కడప – చెన్నై ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం

image

కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పరిధిలోని కడప – చెన్నై ప్రధాన రహదారిపై మండపం పల్లి కనము వద్ద కారు, బస్సు ఢీకొన్న ఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు గ్రామస్థులు వెల్లడించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు అన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News December 9, 2025

కడప జిల్లా SP కీలక సూచన.!

image

భూ వివాదాలు, ఆర్థిక నేరాల విచారణలో న్యాయపరమైన నిబంధనలు పాటించాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారులకు సూచించారు. సోమవారం ఎస్పీ ప్రొద్దుటూరు పోలీస్ అధికారులకు కేసుల విచారణలో నిర్దేశం చేశారు. క్రిమినల్ కేసులు నమోదైన ఎడల వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. సంబంధిత అధికారులు, లీగల్ ప్రొసీజర్ మేరకు కేసు విచారణ త్వరితగతిన నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు.

News December 9, 2025

వైసీపీ హయాంలోనే కల్తీ నెయ్యి సరఫరా: లింగారెడ్డి

image

వైసీపీ హయాంలోనే టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ఆరోపించారు. ఆయన సోమవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అప్పట్లో టీటీడీ నెయ్యి సరఫరాలో నిబంధనలు సడలించారన్నారు. వేల కిలోమీటర్ల దూరంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఉనికిలో లేని కంపెనీల నుంచి నెయ్యి కొనుగోలు చేశారన్నారు. టీటీడీ పవిత్రత, భక్తుల మనోభావాలు, ఆరోగ్యాలు దెబ్బతినేలా చేశారన్నారు.

News December 9, 2025

వైసీపీ హయాంలోనే కల్తీ నెయ్యి సరఫరా: లింగారెడ్డి

image

వైసీపీ హయాంలోనే టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ఆరోపించారు. ఆయన సోమవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అప్పట్లో టీటీడీ నెయ్యి సరఫరాలో నిబంధనలు సడలించారన్నారు. వేల కిలోమీటర్ల దూరంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఉనికిలో లేని కంపెనీల నుంచి నెయ్యి కొనుగోలు చేశారన్నారు. టీటీడీ పవిత్రత, భక్తుల మనోభావాలు, ఆరోగ్యాలు దెబ్బతినేలా చేశారన్నారు.