News March 25, 2025
కడప జడ్పీ ఎన్నికల్లో పోటీ చేయం: వాసు

త్వరలో జరగనున్న కడప జడ్పీ ఎన్నికపై టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. తాము ఎన్నికల్లో పోటీచేయలేదని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి (వాసు) స్పష్టం చేశారు. తమ పార్టీకి సంఖ్యాబలం లేదని అందుకే పోటీ చేయడం లేదన్నారు. అటు చంద్రబాబు కూడా దీనిపై స్పష్టత ఇచ్చారన్నారు. కాగా కడపలో మొత్తం 50 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, వైసీపీకి 42, టీడీపీ6గా సంఖ్యా బలం ఉంది.
Similar News
News March 31, 2025
అలా చేస్తే దక్షిణాదికి అన్యాయం: తులసి రెడ్డి

విజయవాడ బాలోత్సవ భవన్లో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో కడప జిల్లాకు చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు తులసి రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాలు కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. దీనిని సరిదిద్దాలని కోరారు. సమావేశంలో సీపీఐ, సీపీఎం, జన చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
News March 31, 2025
రంజాన్ సందర్భంగా కడప జిల్లాలో భారీ బందోబస్త్

కడప జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగ నేపథ్యంలో భారీ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కడపలోని బిల్డప్ సర్కిల్ సమీపంలోనీ ఈద్గా వద్ద సోమవారం భద్రతను ఎస్పీ పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులూ లేకుండా తగిన భద్రతను నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఆన్ ఈద్గాల వద్ద ప్రజలకు తగిన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
News March 31, 2025
మత సామరస్యానికి ప్రతీక కడప జిల్లా: SP

కడప జిల్లాలోని హిందూ, ముస్లిం సోదరులు కలిసిమెలిసి జీవిస్తూ మత సామరస్యానికి ప్రతీకగా జిల్లాను నిలిపారని జిల్లా SP అశోక్ కుమార్ పేర్కొన్నారు. కడప ఉమేశ్ చంద్ర కల్యాణ మండపంలో ముస్లిం సోదరులకు, పోలీస్ శాఖలోని ముస్లిం పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆదివారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. కడపలో ప్రతి ఒక్కరు సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు.