News January 30, 2025

కడప జిల్లలో విద్యకు ప్రాధాన్యత: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. సింహాద్రిపురం మండలం ZPHS నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి బుధవారం జిల్లా కలెక్టర్ హాజరై ప్రారంభించారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా సింహాద్రిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిలిచిందన్నారు. ప్రభుత్వం, ప్రవేటు, దాతలు, గ్రామ పెద్దలు అందరి సహకారంతో అద్భుతమైన స్కూలును నిర్మించారని కలెక్టర్ అన్నారు.

Similar News

News November 17, 2025

మైదుకూరు ఎమ్మెల్యే కేసులో నిందితుల అరెస్ట్

image

మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను బెదిరించిన ఏడుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు ఎమ్మెల్యేను బెదిరించి రూ.1.70 కోట్లు కాజేశారు. తాజాగా ఈ కేసులోని నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఢిల్లీకి చెందిన ఐడీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజర్ కూడా ఉండడం గమనార్హం.

News November 17, 2025

మైదుకూరు ఎమ్మెల్యే కేసులో నిందితుల అరెస్ట్

image

మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను బెదిరించిన ఏడుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు ఎమ్మెల్యేను బెదిరించి రూ.1.70 కోట్లు కాజేశారు. తాజాగా ఈ కేసులోని నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఢిల్లీకి చెందిన ఐడీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజర్ కూడా ఉండడం గమనార్హం.

News November 17, 2025

ప్రొద్దుటూరు అంటే భయపడుతున్న అధికారులు..?

image

ప్రొద్దుటూరులో పనిచేయాలంటే అధికారులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పనిచేసిన 43మంది అధికారులపై ఇప్పుడు విచారణకు ఆదేశించారు. ఇక్కడి హౌసింగ్ శాఖలోని నలుగురు సిబ్బందిపై క్రిమినల్ చర్యలకు ఆదేశించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు ఇక్కడి అధికారులను ఇష్టారీతిగా వాడుకుంటున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారినప్పుడల్లా ఆ అధికారులు ఇబ్బంది పడుతున్నారు.