News November 16, 2024

కడప జిల్లాకు వైఎస్ షర్మిల రాక

image

ఈనెల 19వ తేదీ నుంచి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప జిల్లా పర్యటన ఖరారైందని ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ రాజా ఒక ప్రకటన ద్వారా తెలిపారు. శనివారం ఆయన తెలుపుతూ.. 19వ తేదీ మంగళవారం కడపలోని దర్గాలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇడుపులపాయకు చేరుకుంటారన్నారు. 20న ఇడుపులపాయ నుంచి కడపకు చేరుకుని అక్కడి నుంచి కలెక్టరేట్‌కు వెళ్తారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో అందుబాటులో ఉంటారన్నారు.

Similar News

News October 23, 2025

కడప జిల్లాలో 2,661 హెక్టార్లలో పంట నష్టం: DAO

image

వర్షాల వల్ల కడప జిల్లాలోని 63 గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (DAO) చంద్ర నాయక్ తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ప్రాథమిక నివేదికల ప్రకారం 2,661 హెక్టార్లలో పంటలు దెబ్బ తిన్నాయని పేర్కొన్నారు. వరి-1,970 హెక్టార్లు, కంది-258 హెక్టార్లు, మినుము-228 హెక్టార్లు, వేరు శనగ-84 హెక్టార్లు, పత్తి-81 హెక్టార్లు, మొక్కజొన్న-40 హెక్టార్లలో దెబ్బ తిన్నాయని వివరించారు.

News October 23, 2025

కడప: తుఫాన్.. విద్యుత్ సమస్యలపై కాల్ చేయండి.!

image

వర్షాల వల్ల విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని, ప్రజల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఎస్ఈ రమణ అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఐదు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
*కడప జిల్లా కంట్రోల్ రూమ్ 94408- 17440,
*కడప డివిజన్ -99017 61782
*పులివెందుల – 78930-63007
*ప్రొద్దుటూరు -78932-61958
*మైదుకూరు-98490 57659
విద్యుత్ ప్రమాదాలు జరిగితే పై నెంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

News October 23, 2025

కడప జిల్లా నుంచి ఆలయాలకు ప్రత్యేక బస్సులు

image

కార్తీకమాసం సందర్భంగా భక్తులు శైవ క్షేత్రాలను దర్శించేందుకు కడప జిల్లాలోని 6 డిపోల పరిధిలో 100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజినల్ మేనేజర్ గోపాల్‌రెడ్డి తెలిపారు. ఈ బస్సులు ఈనెల 27 నుంచి వచ్చేనెల 3, 10, 17తేదీల్లో పొలతల క్షేత్రం, నిత్యపూజ కోన, లంకమల్ల, అగస్తీశ్వర కోన, కన్యతీర్థం, నయనాలప్ప కోన, పుష్పగిరి, శ్రీశైలం తదితర క్షేత్రాలకు బస్సు సర్వీసులు భక్తులకు అందుబాటులో ఉంటాయన్నారు.