News September 28, 2024
కడప జిల్లాలో టెట్ పరీక్షలు.. 8 కేంద్రాల ఏర్పాటు

అక్టోబర్ 03 నుంచి 21 వరకు రోజుకు రెండు సెషన్లలో APTET కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి అనురాధ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను https://aptet.apcfss.in నందు పొంద గలరని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News December 18, 2025
కడప మీదుగా ప్రయాగ్రాజ్కు ప్రత్యేక రైలు

ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి నుంచి కడప మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు గుంతకల్ రైల్వే డివిజనల్ అధికారులు తెలిపారు. ఈనెల 20 ఉదయం 8:15 నిమిషాలకు రైలు బయలుదేరి రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, గుత్తి, గుంతకల్, రాయచూర్, సికింద్రాబాద్, నాగపూర్, భోపాల్ మీదుగా ప్రయాగరాజ్ చేరుకుంటుంది.
News December 18, 2025
కడప మీదుగా ప్రయాగ్రాజ్కు ప్రత్యేక రైలు

ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి నుంచి కడప మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు గుంటకల్ రైల్వే డివిజనల్ అధికారులు తెలిపారు. ఈనెల 20 ఉదయం 8:15 నిమిషాలకు రైలు బయలుదేరి రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, గుత్తి, గుంతకల్, రాయచూర్, సికింద్రాబాద్, నాగపూర్, భోపాల్ మీదుగా ప్రయాగరాజ్ చేరుకుంటుంది.
News December 18, 2025
కడప జిల్లాలో లక్ష్యానికి దూరంగా AMCల రాబడి

కడప జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల నుంచి 2025-26లో రూ.13.53 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. నవంబర్ చివరి నాటికి రూ.7.09 కోట్లు (52.44%) మాత్రమే వసూలైంది (రూ.కోట్లలో). కడప – 1.54, ప్రొద్దుటూరు – 0.71, బద్వేల్ – 1.20, జమ్మలమడుగు – 0.42, పులివెందుల – 0.67, మైదుకూరు – 1.44, కమలాపురం – 0.44, సిద్దవటం – 0.13, ఎర్రగుంట్ల – 0.38, సింహాద్రిపురం – 0.12 మాత్రమే వసూలైంది.


