News March 28, 2025
కడప జిల్లాలో తగ్గిన అరటికాయల ధరలు.!

కడప జిల్లాలో అరటి ధరలు అమాంతంగా తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం టన్ను రూ.6వేల నుంచి రూ.9వేలు పలుకుతున్నాయి. ఇటీవల కురిసిన వడగండ్ల వానకు అరటి గెలలన్నీ నేలకూలడంతో నష్టపోయిన రైతులను తగ్గిన అరటి ధరలు మరింత కుంగదీస్తున్నాయి. గతంలో టన్ను అరటికాయలు రూ.16 నుంచి రూ.18వేలు పలికాయి. ప్రభుత్వం స్పందించి అరటికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. = రైతులను = అరటికాయలు రూ.16 వేల
Similar News
News November 18, 2025
‘రాయలసీమ’ పేరుకు నేటికి 97 ఏళ్లు!

బ్రిటిష్ కాలంలో ‘దత్త మండలం’గా పిలవబడిన మన ప్రాంతానికి ‘రాయలసీమ’ అనే పేరు పెట్టి నేటికి 97ఏళ్లు పూర్తయ్యాయి. 1928 నవంబర్ 18న నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో చిలుకూరి నారాయణరావు ఈ పేరును ప్రతిపాదించారు. విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలుకు ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ ‘‘రాయలసీమ’’ అనే పేరును ప్రతిపాదించారు. పప్పూరు రామాచార్యులు ఈ ప్రతిపాదనను బలపరచగా, సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
News November 18, 2025
‘రాయలసీమ’ పేరుకు నేటికి 97 ఏళ్లు!

బ్రిటిష్ కాలంలో ‘దత్త మండలం’గా పిలవబడిన మన ప్రాంతానికి ‘రాయలసీమ’ అనే పేరు పెట్టి నేటికి 97ఏళ్లు పూర్తయ్యాయి. 1928 నవంబర్ 18న నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో చిలుకూరి నారాయణరావు ఈ పేరును ప్రతిపాదించారు. విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలుకు ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ ‘‘రాయలసీమ’’ అనే పేరును ప్రతిపాదించారు. పప్పూరు రామాచార్యులు ఈ ప్రతిపాదనను బలపరచగా, సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
News November 18, 2025
గండికోటలో ప్రమాదాల అంచున సెల్ఫీ

గండికోట ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం. యువకులు, విద్యార్థులు, పెద్దలు, కొందరు పర్యాటకులు గండికోటను దర్శిస్తుంటారు. ఇక్కడ లోయ ఉండడంతో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంటుంది. రెండు కొండల మధ్య లోయ చుపరులను ఆకట్టుకుంటూ కనువిందు చేస్తుంటుంది. ఈ దృశ్యాన్ని తిలకిస్తూ ప్రమాదపు అంచున ఫొటోలు దిగుతూ ఉంటారు. అధికారులు ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.


