News September 25, 2024
కడప జిల్లాలో పటిష్ఠంగా ఇసుక సరఫరా: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పారదర్శక విధానంతో జిల్లాలో ఉచిత ఇసుక సరఫరాను పటిష్ఠంగా అమలు చేస్తున్నట్లు, కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి రాష్ట్ర గనులు భూగర్భ శాఖ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ కుమార్కు వివరించారు. ఉచిత ఇసుక సరఫరా అంశంపై కలెక్టర్లతో గనులు భూగర్భ శాఖ రాష్ట్ర కార్యదర్శి వీసీ ద్వారా సమీక్షించారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ రవాణాదారులు మధ్య సేవాస్థాయి ఒప్పందం అంశాలపై వివరించారు.
Similar News
News May 8, 2025
పెండ్లిమర్రిలో రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే

పెండ్లిమర్రి మండలంలోని కొత్తూరు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులను వేంపల్లి శ్రీరాంనగర్కు చెందిన బాలయ్య, రాజీవ్ నగర్కు చెందిన మల్లికార్జున, మదనపల్లెకి చెందిన మల్లికార్జునగా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News May 8, 2025
పెండ్లిమర్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

పెండ్లిమర్రి మండలం కొత్తూరు వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. బైక్ను కంటైనర్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరొకరు వేంపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News May 8, 2025
కడప: రిమ్స్ ప్రిన్సిపల్గా డాక్టర్ జమున

కడప రిమ్స్ మెడికల్ కళాశాల నూతన ప్రిన్సిపల్గా డాక్టర్ జమున గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం కళాశాల సిబ్బంది ఆమెకు ఘనంగా స్వాగతం పలికి బొకేలు అందజేశారు. రిమ్స్ మెడికల్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె అన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటానని పేర్కొన్నారు.