News August 31, 2024

కడప జిల్లాలో ప్రారంభమైన ఫించన్ల పంపిణీ

image

ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే పెన్షన్ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామున నుంచి అట్టహాసంగా ప్రారంభమైంది. కడప నగరంలోని నాగరాజు పేటలో జిల్లా కలెక్టర్ శివశంకర్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. జిల్లా వ్యాప్తంగా నేడు 2,63,283 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి రూ.112.22 కోట్లు విడుదల చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 100శాతం ఫించన్లను నేడే అందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

Similar News

News December 4, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు..!

image

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.12765.00
☛ బంగారం 22 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.11744.00
☛ వెండి 10గ్రాములు రేట్: రూ.1760.00

News December 4, 2025

కడప జిల్లాలో 21 మంది ఎస్ఐల బదిలీలు

image

కడప జిల్లాలో భారీగా ఎస్ఐల బదిలీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 21 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ గురువారం కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయినవారు సంబంధిత స్టేషన్లలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలు చోటుచేసుకున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.

News December 4, 2025

నేడు ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం

image

ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో గురువారం సీతారాముల స్వామి వారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. కళ్యాణం చేయించాలనుకునేవారు ఒక్కో టికెట్‌కు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు.