News August 26, 2024

కడప జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం

image

దువ్వూరు మండలం చింతకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి తిరుపతికి వెళుతున్న కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నాగలక్ష్మి (55), భగత్ సింగ్ (48) ఇద్దరు మృతి చెందారు. అలాగే నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం వారిని ప్రొద్దుటూరుకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.

Similar News

News September 30, 2024

కడప: నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం

image

ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. నేటి ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. 08562-24437 ల్యాండ్ లైన్ నంబర్‌కు ప్రజలు ఫోన్ చేసి నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

News September 30, 2024

రాజంపేట: ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి బంగారు పతకం

image

రాజంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థి కౌశిక్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో బంగారు పథకం సాధించినట్లు జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి తెలిపారు. హరియాణా రాష్ట్రంలో నిర్వహించిన సబ్ జూనియర్ నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ ఆటల పోటీల కార్యక్రమంలో విద్యార్థి పాల్గొన్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉమ్మడి కడప జిల్లా విద్యార్థి బంగారు పతకం సాధించారని సంతోషం వ్యక్తం చేశారు.

News September 29, 2024

కలసపాడు: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

image

మండలంలోని ఎగువ రామాపురానికి చెందిన బీటెక్ విద్యార్థి తమిళనాడు రాష్ట్రంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అన్నదమ్ములు ఇద్దరు బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొనడంతో తమ్ముడు అర్జున్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. అన్న అరవింద రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.