News April 3, 2025
కడప జిల్లాలో యూట్యూబర్స్పై కేసు నమోదు

ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో ఇద్దరు యూట్యూబర్స్పై కేసు నమోదు అయింది. సీఐ హేమ సుందర్ తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన శంకర్ రాజు, సత్యనారాయణ రెడ్డి అనే యూట్యూబర్స్, జర్నలిస్ట్ సుబ్రహ్మణ్యం డబ్బుల కోసం బెదిరించారని పోలీసులకు కోడూరు రేంజ్ పీఏ శ్యాంసుందర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.
Similar News
News April 11, 2025
యోగి వేమన విశ్వవిద్యాలయానికి స్వర్ణ పతకం

కడప: కశ్మీర్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు జరిగిన అఖిల భారత అంతర విశ్వవిద్యాలయ పవర్ లిఫ్టింగ్ పోటీలలో యోగి వేమన విశ్వవిద్యాలయానికి స్వర్ణ పతకం లభించింది. విద్యార్థి డి.మురళీకృష్ణ 59వ కేజీల విభాగంలో బంగారు పతకం సాధించారు. వైవీయూకు ఈ పతకం ఐదవది. వర్సిటీ క్రీడా బోర్డు సహాయ సహకారాలు అందజేయడం ద్వారా ఈ పతకం సొంతమైనట్లు క్రీడా బోర్డు కార్యదర్శి డాక్టర్ రామ సుబ్బారెడ్డి తెలిపారు.
News April 11, 2025
కడప జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

కడప జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. మొత్తం 64 పరీక్షా కేంద్రాల్లో 32,885 మంది పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 17,114 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 15,771 మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది.
☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 11, 2025
ఒంటిమిట్ట రామదాసు ఈయనే..

భద్రాచలంలో రాములోరికి గుడి నిర్మించి రామదాసు చరిత్రలో నిలిచిపోయారు. ఒంటిమిట్ట రామాలయానికి ఆ స్థాయిలోనే కృషి చేశారు వావిలికొలను సుబ్బారావు. 1863 జనవరి 23న ప్రొద్దుటూరులో జన్మించిన ఆయన ఆలయ జీర్ణోద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం టెంకాయ చిప్ప చేత పట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఊరూరా తిరిగారు. భిక్షంగా వచ్చిన నగదును ఆలయ అభివృద్ధికి ఖర్చు చేశారు. 1936, ఆగస్టు 1న మద్రాసులో కన్నుమూశారు.