News April 3, 2025

కడప జిల్లాలో యూట్యూబర్స్‌పై కేసు నమోదు

image

ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో ఇద్దరు యూట్యూబర్స్‌పై కేసు నమోదు అయింది. సీఐ హేమ సుందర్ తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన శంకర్ రాజు, సత్యనారాయణ రెడ్డి అనే యూట్యూబర్స్, జర్నలిస్ట్ సుబ్రహ్మణ్యం డబ్బుల కోసం బెదిరించారని పోలీసులకు కోడూరు రేంజ్ పీఏ శ్యాంసుందర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.

Similar News

News April 23, 2025

10th RESULTS: కడప జిల్లాలో సత్తా చాటిన బాలురు

image

పదో పరీక్షా ఫలితాల్లో కడప జిల్లాలోని బాలురు సత్తాచాటారు. మొత్తం 27,680 మంది పరీక్ష రాయగా 22,361 మంది పాసయ్యారు. 14,278 మంది బాలురులో 11,189 మంది, 13,402 మంది బాలికలు పరీక్ష రాయగా 11,172 మంది పాసయ్యారు. 80.78 శాతం పాస్ పర్సంటేజ్‌తో కడప జిల్లా 18వ స్థానంలో నిలిచింది. గతేడాది మూడో స్థానంలో నిలవగా.. ఈసారి 18వ స్థానానికి పడిపోయింది.

News April 23, 2025

గుంటూరు యువకుడిపై.. కడప యువతి ఫిర్యాదు

image

సోషల్ మీడియా పరిచయం పెళ్లి వరకు వెళ్లి మనస్పర్థల కారణంగా నిలిచిపోయింది. అయినప్పటికీ గుంటూరుకు చెందిన ఇమ్రాన్ అనే యువకుడు తనను వేధిస్తున్నాడని బాధిత యువతి కడప పోలీసులకు ఫిర్యాదు చేసింది. పార్లర్ నిర్వహించే కడప యువతికి గుంటూరుకు చెందిన ఇమ్రాన్‌తో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినప్పటికీ ఇమ్రాన్ తనకు ఫొటోలు పంపి వేధిస్తున్నాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది.

News April 23, 2025

జగన్‌ను కలిసిన కడప నేతలు

image

మాజీ సీఎం జగన్‌ను కడప జిల్లా వైసీపీ నేతల కలిశారు. తాడేపల్లిలోని మాజీ సీఎం నివాసంలో ఇవాళ సమావేశం జరిగింది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఇతర నాయకులు అక్కడికి వెళ్లారు. పీఏసీలో తనకు చోటు కల్పించడంపై జగన్‌కు అంజద్ బాషా ధన్యవాదాలు తెలిపారు. 

error: Content is protected !!