News February 11, 2025
కడప జిల్లాలో విషాదం.. తల్లి, కొడుకు మృతి

కడప జిల్లా బి.కోడూరు మండలం గుంతపల్లిలో మంగళవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో తల్లి, కుమారుడు మృతి చెందారు. తల్లి గురమ్మ, కుమారుడు జయసుబ్బారెడ్డి పొలానికి నీళ్లు పెడుతుండగా విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న బి.కోడూరు ఎస్ఐ రాజు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 24, 2025
రేపు పులివెందులలో జగన్ పర్యటన

మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 4 గంటలకు పులివెందుల భాకరాపురం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 26వ తేదీన ఒక వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం బ్రాహ్మణపల్లి అరటి తోటలను సందర్శించి, లింగాల మాజీ సర్పంచి మృతి పట్ల కుటుంబాన్ని పరామర్శిస్తారు. తరువాత వేల్పులలో స్థానికులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటారు.
News November 24, 2025
ఈ నెల 24 నుంచి రైతన్నా.. మీకోసం: కడప కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమంలో భాగంగా ఈ నెల 24 నుంచి రైతన్నా.. మీకోసం కార్యక్రమంను అమలు చేస్తోందని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఈ మేరకు టెలి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థ వంతంగా నిర్వహించేందుకు తగు కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. వ్యవసాయ రంగంలో పెను మార్పుల ద్వారా సాగును లాభసాటి చేసేందుకు కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.
News November 24, 2025
ఈ నెల 24 నుంచి రైతన్నా.. మీకోసం: కడప కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమంలో భాగంగా ఈ నెల 24 నుంచి రైతన్నా.. మీకోసం కార్యక్రమంను అమలు చేస్తోందని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఈ మేరకు టెలి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థ వంతంగా నిర్వహించేందుకు తగు కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. వ్యవసాయ రంగంలో పెను మార్పుల ద్వారా సాగును లాభసాటి చేసేందుకు కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.


