News November 13, 2024
కడప జిల్లా ఎమ్మెల్యేకు అరుదైన అవకాశం

రాష్ట్ర అసెంబ్లీలో చీఫ్ విప్తోపాటు శాసనసభ, మండలి విప్లుగా 15 మందిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో జమ్మలమడుగు MLA ఆదినారాయణరెడ్డిని శాసనసభ విప్గా నియమించారు. అయితే TDP నుంచి 15 మందికి, జనసేనలో నలుగురికి చోటు దక్కింది. కాగా BJP నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యేగా ఆదినారాయణరెడ్డి మాత్రమే నిలిచారు. దీంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
Similar News
News November 24, 2025
ప్రొద్దుటూరు: బంగారు వ్యాపారి బాధితులు ఎందరో..?

ప్రొద్దుటూరు బంగారు వ్యాపారి తనిగంటి బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వచ్చి తమను మోసం చేశారని ఫిర్యాదు చేస్తున్నారు. వ్యాపారంలో మోసం చేసి తమను బయటికి గెంటేశారని మరదలు పద్మజ ఫిర్యాదు చేశారు. HYD హేమంత్ శర్మ, మార్వాడి షమీర్, JMD సంధ్య, BDVL శ్రావణి, లేఖ ఇలా ఎందరో తమకు బంగారం బాకీ ఉన్నాడంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. చట్ట విరుద్ధంగా స్కీం, చీటీల వ్యాపారంలో మోసం చేశాడంటూ బాధితులు వాపోతున్నారు.
News November 24, 2025
రేపు పులివెందులలో జగన్ పర్యటన

మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 4 గంటలకు పులివెందుల భాకరాపురం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 26వ తేదీన ఒక వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం బ్రాహ్మణపల్లి అరటి తోటలను సందర్శించి, లింగాల మాజీ సర్పంచి మృతి పట్ల కుటుంబాన్ని పరామర్శిస్తారు. తరువాత వేల్పులలో స్థానికులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటారు.
News November 24, 2025
ఈ నెల 24 నుంచి రైతన్నా.. మీకోసం: కడప కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమంలో భాగంగా ఈ నెల 24 నుంచి రైతన్నా.. మీకోసం కార్యక్రమంను అమలు చేస్తోందని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఈ మేరకు టెలి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థ వంతంగా నిర్వహించేందుకు తగు కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. వ్యవసాయ రంగంలో పెను మార్పుల ద్వారా సాగును లాభసాటి చేసేందుకు కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.


