News October 24, 2024

కడప జిల్లా విద్యాశాఖాధికారిగా మీనాక్షి దేవి

image

కడప జిల్లా విద్యాశాఖాధికారిగా ప్రొద్దుటూరు డిప్యూటీ ఈఓగా నియమితులైన మీనాక్షి దేవిని నియమిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మవరం డిప్యూటీ ఈఓగా ఉన్న మీనాక్షి దేవిని ప్రొద్దుటూరు డిప్యూటీ ఈఓగా బదిలీ చేశారు. వెంటనే జిల్లా విద్యాశాఖాధికారిగా నియమిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. కడప డీఈఓగా ఉన్న అనూరాధను విద్యాశాఖలో రిపోర్టు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

Similar News

News November 4, 2025

రేపు కడపకు రానున్న AR రెహమాన్

image

ప్రముఖ సంగీత దర్శకుడు AR రెహమాన్ రేపు కడపకు రానున్నారు. కడప నగరంలో ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలలో భాగంగా నిర్వహించే గంధం వేడుకకు ఆయన హాజరుకానున్నారు. దర్గాలో జరిగే ఉరుసు ఉత్సవాలకు ప్రతి ఏడాది ఆనవాయితీగా ఆయన వస్తుంటారు. రేపు రాత్రి దర్గాలో జరిగే గంధ మహోత్సవం వేడుకలకు పీఠాధిపతితో కలిసి ఆయన దర్గాలో ప్రార్థనలు చేయనున్నారు.

News November 4, 2025

కమలాపురం: హత్య కేసులో నిందితునికి రిమాండ్ విధింపు

image

కమలాపురం మండలం అప్పారావు పల్లెలో జరిగిన హత్య కేసులో నిందితుడిని సోమవారం పోలీసుల అరెస్టు చేశారు. సీఐ రోషన్ వివరాలు.. ‘చెన్నారెడ్డి, విశ్వనాథ్ రెడ్డిలు అన్నదమ్ములు. విశ్వనాథరెడ్డి మద్యానికి అలవాటుపడి చెన్నారెడ్డి ఆస్తిలో కొంత ఇవ్వాలని తరచూ గొడవ పడేవాడు. ఇందుకు తమ్ముడు ఒప్పుకోకుండా విశ్వనాథ్ రెడ్డిని బలంగా కొట్టడంతో చనిపోయాడు’. దీంతో నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు.

News November 4, 2025

ఒంటిమిట్టలో త్వరలో నిత్య అన్నప్రసాద కేంద్రం ప్రారంభం

image

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో త్వరలోనే నిత్య అన్నప్రసాద కేంద్రం ప్రారంభించనున్నట్లు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. సోమవారం ఆయన నిత్య అన్నప్రసాద కేంద్రం ఏర్పాటు చేయబోయే ప్రదేశాన్ని పరిశీలించారు. తాత్కాలిక ప్రమాద రహిత జర్మన్ షెడ్లతో నిత్య అన్న ప్రసాద కేంద్రం ప్రారంభించేందుకు కేంద్ర పురావస్తుశాఖ అధికారులు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిపారు.