News August 4, 2024
కడప జిల్లా TODAY TOP NEWS

✎దువ్వూరులో ఎర్రచందనం దుంగలు స్వాధీనం
✎మైదుకూరులో ‘ఫ్రెండ్షిప్ డే’ రోజున విషాదం
✎కడపలో ఇంటికి కన్నం వేసి.. రూ.లక్ష స్వాహా
✎బద్వేలు: తల్లిని చేసి కువైట్కు జారుకున్న వ్యక్తి
✎పెండ్లిమర్రి: కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి
✎అన్నమయ్య: బాలికపై అత్యాచారం
✎ నందలూరు: అడవిలో తప్పిపోయిన వ్యక్తి సేఫ్
✎ ఒంటిమిట్టలో మహిళపై దాడి
✎: ఎర్రగుంట్ల: కొడుకు అప్పులతో ఆత్మహత్య చేసుకున్న తండ్రి
Similar News
News February 26, 2026
పులివెందుల సీఐ ఇంట్లో భారీగా నగదు

ఏసీబీ దాడుల్లో దొరికిన పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారుల విచారణ ముగిసింది. ఇందులో రూ. 6 లక్షల నగదు, 200 గ్రాముల బంగారం, 54 విదేశీయ మద్యం బాటిల్లు, విలువైన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం నగదు సీఐ రెండో భార్య ఇంట్లో గుర్తించారు. ఇందులో డీఎస్పీ మురళీ నాయక్ ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
News February 25, 2026
27న వైవీయూలో జాబ్ మేళా: ప్రిన్సిపల్

కడప YVUలో ఈ నెల 27వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ ప్రొ. టి. శ్రీనివాస్ తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, వైవీయు ప్లేస్మెంట్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ ఎంపికలు నిర్వహిస్తున్నామన్నారు. 13 కంపెనీలు విశ్వవిద్యాలయానికి వస్తున్నాయన్నారు. టెన్త్ నుంచి పీజీ చదివిన వారు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 6300125455, 94405 16153 నంబర్లను సంప్రదించాలన్నారు.
News February 25, 2026
కడప జిల్లాలో పలువురు ఆర్డీవోల బదిలీ

కడప జిల్లాలో పనిచేస్తున్న పలువురు గ్రూప్-1 అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కడప కార్పొరేషన్ కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప ఆర్డీవో జాన్ అవిన్, జమ్మలమడుగు ఆర్డీవో ఆదిమూలం సాయిశ్రీలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.


