News August 19, 2024

కడప జిల్లా TODAY TOP NEWS

image

✎ కడప: ఆర్టీసీ ఈడీ నియామకంపై అయోమయం
✎ ఒంటిమిట్ట: వైభవంగా కోదండ రాముని పౌర్ణమి కళ్యాణం
✎ బెంగళూరులో విద్యుత్ షాక్‌తో కడప యువకుడి మృతి
✎ వైసీపీ నేతలు కారుకూతలు కూస్తున్నారు: బీటెక్ రవి
✎ ప్రొద్దుటూరు: 25న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
✎ కంపెనీలు తెచ్చే ముఖమా వైఎస్ జగన్ నీది?: బీటెక్ రవి
✎ ముద్దనూరు: 500 క్యూసెక్కుల నీరు విడుదల
✎ కడప జిల్లాలో బాధ్యతలు చేపట్టిన ఎస్సై, సీఐలు

Similar News

News November 27, 2025

కడప జిల్లాలో రూ.22.75 కోట్లు మాయం?

image

కడప జిల్లాలో పేజ్-3 ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన డబ్బులు కనిపించడం లేదు. అప్పట్లో ప్రతి ఇంటికి పునాదుల కోసం రూ.35 వేలు వసూలు చేశారు. నిర్మాణాలు మొదలవ్వని 6,501 ఇళ్లకు సంబంధించి సుమారు రూ.22.75 కోట్లు స్వాహాపై ఇటీవల పరిశీలన చేపట్టారు. జిల్లాలో 16,765 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 10,264 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. మిగతా 6,501 ఇళ్లు ప్రారంభం కాలేదు. దీనిపై విచారణ చేపట్టారు.

News November 27, 2025

MP సీఎం రమేశ్ తల్లికి ప్రముఖుల నివాళి

image

అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తల్లి చింతకుంట రత్నమ్మ పార్థివ దేహం వద్ద ప్రముఖులు నివాళి అర్పించారు. మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు, అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణమరాజు, తెలంగాణ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కెవీపీ రామచంద్రారావు, ఇతర నాయకులు రత్నమ్మ పార్థివ దేహం వద్ద నివాళులర్పించి సీఎం రమేశ్‌ను పరామర్శించారు.

News November 27, 2025

బెంగళూరుకు బయలుదేరిన మాజీ సీఎం వైఎస్ జగన్

image

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో 3 రోజుల పర్యటన ముగించుకుని గురువారం బెంగళూరుకు పయనమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం పులివెందులకు చేరుకున్న ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. బుధవారం అరటి తోటలను పరిశీలించి రైతుల బాధలను తెలుసుకున్నారు. అనంతరం వైసీపీ నాయకుల కుటుంబాలను పరామర్శించారు. సాయంత్రం ప్రజలతో మమేకమై పలు సమస్యలను తెలుసుకున్నారు. గురువారం ఉదయం తన నివాసం నుంచి బెంగళూరుకు పయనమై వెళ్లారు.