News October 9, 2024

కడప: జ్యోతి క్షేత్ర సమస్య కేంద్ర అటవీ శాఖ మంత్రి దృష్టికి

image

గత కొన్ని సంవత్సరాలుగా నిరాశ్రయులకు, భక్తులకు నిరంతరం అన్నదానం చేస్తున్న కాశినాయన క్షేత్రంలోని ఆలయ నిర్మాణాలను, అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. ఈ విషయాన్ని హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన బుధవారం కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలసి జ్యోతిక్షేత్ర ప్రాముఖ్యతను వివరించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

Similar News

News December 13, 2025

వరంగల్‌లో బద్వేల్‌కు చెందిన ప్రొఫెసర్ సూసైడ్

image

కడప జిల్లా బద్వేల్‌కి చెందిన ప్రొఫెసర్ వెంకట సుబ్బారెడ్డి వరంగల్ NITలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. శుక్రవారం ధర్మసాగర్ రిజర్వాయర్‌లో పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసును హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రొఫెసర్ వెంకట సుబ్బారెడ్డి కంప్యూటర్ విభాగంలో పని చేస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 13, 2025

కడప: నేడు నవోదయ ఎంట్రన్స్.. ఇవి పాటించండి.!

image

జవహర్ నవోదయ పాఠశాలల్లో ప్రవేశాలకు పరీక్ష రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఒక గంట ముందుగానే చేరుకోవాలని డిఇఓ శంషుద్దీన్ పేర్కొన్నారు. నేడు కడప జిల్లా వ్యాప్తంగా 2,616 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 14 కేంద్రాల్లో విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శనివారం ఉదయం 11:30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1:30 నిమిషాల వరకు పరీక్ష ఉంటుందని అన్నారు.

News December 13, 2025

కడప జిల్లాకు భారీగా నిధులు

image

కడప జిల్లాలో వినూత్నంగా అమలవుతున్న పథకాల అమలు నిమిత్తం రూ.7.5కోట్ల నిధులు నీతి అయోగ్ విడుదల చేసిందని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. అందులో భాగంగా స్టార్ట్ అప్ కడప, స్మార్ట్ కిచెన్, ఆర్గానిక్ మార్కెటింగ్, అంగన్వాడీల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణకు చేస్తున్న కార్యక్రమాల ప్రగతిని నీతి అయోగ్ కార్యదర్శి శేఖర్‌కు కలెక్టర్ శ్రీధర్ న్యూఢిల్లీలో వివరించారు.