News March 28, 2024

కడప టీడీపీ MP అభ్యర్థిగా వారిలో ఎవరు .?

image

రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున కడప MP అభ్యర్థిగా ఎవర్ని నియమించాలని అధిష్ఠానం మల్లగుళ్ళాలు పడుతుంది. రోజుకో కొత్త పేరుతో ఆసక్తి రేపుతోంది. వీరశివారెడ్డి, భూపేశ్‌రెడ్డి, రితీశ్‌రెడ్డి, ఉక్కు ప్రవీణ్, వాసు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటికే కడప పార్లమెంటులోని ప్రజలకు ఐవీఆర్ సర్వే ద్వారా వీరి పేర్లతో ఫోన్లు చేస్తుంది. ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారా అని టీడీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.

Similar News

News May 8, 2025

పెండ్లిమర్రిలో రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే

image

పెండ్లిమర్రి మండలంలోని కొత్తూరు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులను వేంపల్లి శ్రీరాంనగర్‌కు చెందిన బాలయ్య, రాజీవ్ నగర్‌కు చెందిన మల్లికార్జున, మదనపల్లెకి చెందిన మల్లికార్జునగా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 8, 2025

పెండ్లిమర్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

image

పెండ్లిమర్రి మండలం కొత్తూరు వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. బైక్‌ను కంటైనర్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరొకరు వేంపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 8, 2025

కడప: రిమ్స్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ జమున

image

కడప రిమ్స్ మెడికల్ కళాశాల నూతన ప్రిన్సిపల్‌గా డాక్టర్ జమున గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం కళాశాల సిబ్బంది ఆమెకు ఘనంగా స్వాగతం పలికి బొకేలు అందజేశారు. రిమ్స్ మెడికల్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె అన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటానని పేర్కొన్నారు.