News June 14, 2024

కడప: తిరుమల ఎక్స్‌ప్రెస్ నంబర్ల మార్పు

image

కడప-విశాఖపట్నం మధ్య తిరుగుతున్న తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్లలలో మార్పు చేసినట్లు కడప రైల్వే చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ ఉమర్ బాషా తెలిపారు. కడప- విశాఖపట్నం, విశాఖపట్నం-కడప మధ్య నడిచే ఈ రైలు ప్రస్తుతం 17487/17488 నంబర్లతో నడుస్తోంది. జులై ఒకటో తేదీ నుంచి ఈ రైలు 18521/18522 నంబర్లతో నడుస్తుందని ఆయన తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పును గుర్తించాలని సూచించారు.

Similar News

News September 17, 2025

తిరుమలలో పులివెందుల వాసి మృతి

image

తిరుమలలో బుధవారం శ్రీవారి భక్తుడు మృతి చెందాడు. టీటీడీ అధికారుల ప్రకారం.. కడప జిల్లా పులివెందుల తాలూకా పార్నపల్లికి చెందిన శ్రీవారి భక్తుడు తిరుమల అద్దె గదుల ప్రాంతంలోని ఓ బాత్రూంలో మృతి చెందాడు. మృతదేహాన్ని పరిశీలించిన అధికారులు అతను గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 17, 2025

కడప జిల్లా వృద్ధేలక్ష్యం: కలెక్టర్ శ్రీధర్

image

ఈ ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలోనే జిల్లాలో మంచి వృద్ధి సాధించామని, రాష్ట్ర స్థూలోత్పత్తిలో 17.33% వృద్ధి లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తున్నామని జిల్లా కడప కలెక్టర్ శ్రీధర్ CM సమావేశంలో వివరించారు. మంగళవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన నాలుగవ జిల్లా కలెక్టర్ల సదస్సులో కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొన్నారు.

News September 17, 2025

బద్వేల్: దొంగనోట్ల మార్పిడి.. ఐదుగురికి జైలు శిక్ష

image

దొంగ నోట్ల మార్పిడి కేసులో ఐదుగురు ముద్దాయిలకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ బద్వేలు జడ్జి పద్మశ్రీ మంగళవారం తీర్పునిచ్చారు. SI మహమ్మద్ రఫీ మాట్లాడుతూ.. సిద్దవటం మండలంలోని మాధవరం-1లోని ఓ వైన్ షాపులో 2010లో కర్నూలు జిల్లా బనగానపల్లెకు చెందిన మాధవరెడ్డి, షర్ఫుద్దీన్, వెంకటేశ్వర్లు, అల్తాఫ్, హుస్సేన్ వలిలు వెయ్యి రూపాయల దొంగ నోటు చలామణి చేయగా కేసు నమోదైంది.