News February 10, 2025
కడప: దస్తగిరికి నోటీసులు

మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. దస్తగిరిని సాక్షిగా పరిగణించడాన్ని సవాల్ చేస్తూ ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై ప్రత్యేక పీపీ, దస్తగిరికి హైకోర్టు నోటీసులు పంపింది. ఈనెల 27కు విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది..
Similar News
News March 16, 2026
రాష్ట్ర స్థాయిలో కడప జిల్లా రికార్డు

జాతీయ లోక్ అదాలత్ నిర్వహణలో కడప జిల్లా అద్భుతమైన పనితీరు కనబరిచి రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని తెలిపారు. జిల్లావ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 1,03,591 కేసులను పరిష్కరించినట్లు చెప్పారు. ఈ కేసుల పరిష్కారంతో కక్షిదారులకు రూ.24.01 కోట్ల చెల్లింపులు జరిగినట్లు పేర్కొన్నారు. సత్వర న్యాయం అందించడంలో జిల్లా యంత్రాంగం, న్యాయవ్యవస్థ సఫలీకృతం అయ్యాయన్నారు.
News March 16, 2026
రాష్ట్ర స్థాయిలో కడప జిల్లా రికార్డు

జాతీయ లోక్ అదాలత్ నిర్వహణలో కడప జిల్లా అద్భుతమైన పనితీరు కనబరిచి రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని తెలిపారు. జిల్లావ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 1,03,591 కేసులను పరిష్కరించినట్లు చెప్పారు. ఈ కేసుల పరిష్కారంతో కక్షిదారులకు రూ.24.01 కోట్ల చెల్లింపులు జరిగినట్లు పేర్కొన్నారు. సత్వర న్యాయం అందించడంలో జిల్లా యంత్రాంగం, న్యాయవ్యవస్థ సఫలీకృతం అయ్యాయన్నారు.
News March 16, 2026
YVUలో పీజీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వనం

YVUలో ప్రవేశాల కోసం విద్యార్థులు ఈ నెల 19వ తేదీ లోపు APPGCET -2026కు
దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ అడ్మీషన్స్ డైరెక్టర్ డా. లక్ష్మీప్రసాద్ తెలిపారు. డిగ్రీ పూర్తయిన వారు, చివరి సెమిస్టర్ పరీక్షలు రాయబోయే వారు https://cets.apsche.ap.gov.in అనే వెబ్సైట్ను క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 8317532040, 8106604789 నంబర్లను సంప్రదించాలన్నారు.


