News January 22, 2025
కడప నగరం వరకే సెలవు

కడపలో ఇవాళ అయోధ్య ఐక్య వేదిక ఆధ్వర్యంలో శ్రీరాముడి కళ్యాణం, శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈవెంట్ నిర్వాహకులు, పాఠశాలల టీచర్ల విజ్ఞప్తి మేరకు అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు నేడు(బుధవారం) సెలవు ప్రకటించారు. ఈ సెలవు కేవలం కడప నగరం వరకే వర్తిస్తుంది. జిల్లాలోని ఇతర విద్యా సంస్థలు పనిచేస్తాయి. తామూ శోభాయాత్రకు వెళ్తామని.. తమకూ సెలవు కావాలని కడప పరిసర మండల వాసులు కోరుతున్నారు.
Similar News
News January 7, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,110
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.12,981
* వెండి 10 గ్రాములు ధర రూ.2,520.
News January 7, 2026
BREAKING: ప్రీ క్వార్టర్ ఫైనల్కు క్వాలిఫై అయిన ఏపీ టీమ్

69వ జాతీయ U-14 బాలికల వాలీబాల్ టోర్నమెంట్లో ఏపీ టీమ్ సత్తా చాటుతోంది. ఇవాళ గోవాపై గెలిచి ప్రీ క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. జమ్మలమడుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ పోటీలు జరుగుతున్నాయి. వరుసగా మూడు సెట్లలో ఆధిపత్యం కనబరిచి మరో 2 సెట్లు ఉండగానే విజయం సాధించింది. దీంతో వారిని పలువురు అభినందిస్తున్నారు. రేపు జరిగే ప్రీ క్వార్టర్ ఫైనల్లో విజయం సాధిస్తే క్వార్టర్ ఫైనల్కు చేరుతుంది.
News January 7, 2026
మైలవరం: వేరు వేరు చోట ఇద్దరు ఆత్మహత్య

మైలవరం మండలంలో మంగళవారం ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వద్దిరాలలో దేవ (22) అనే యువకుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇతనికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అలాగే దొమ్మర నంద్యాలకు చెందిన షేక్ నూర్జహాన్ (20) అనే వివాహిత కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ రెండు ఘటనలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


