News October 31, 2024

కడప నుంచి బెంగళూరు బయలుదేరిన జగన్

image

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కడప జిల్లాలో తన మూడు రోజుల పర్యటన ముగించుకొని బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. బెంగళూరు నుంచి రెండు రోజుల క్రితం హెలికాప్టర్‌లో ఇడుపులపాయ వెళ్లి అనంతరం పులివెందుల చేరుకున్నారు. మంగళ, బుధవారాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలను, ప్రతి ఒక్కరిని పులివెందులలోని తన నివాసంలో కలిశారు. క్యాడర్‌కు దిశానిర్దేశం చేసి గురువారం ఉదయం ఇడుపులపాయ చేరుకొని హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లారు.

Similar News

News November 14, 2025

పంటల రక్షణకు IOT సాంకేతికత అవసరం: కలెక్టర్

image

కడప కలెక్టరేట్‌లో మైక్రో ఇరిగేషన్, ఉద్యాన పంటల సస్యరక్షణపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ సమీక్ష నిర్వహించారు. వాతావరణ మార్పుల పర్యవేక్షణకు నూతన సాంకేతిక పరిజ్ఞానం మేళవింపు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. క్రాపిన్, ఫసల్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. ఐఓటీ ఆధారిత స్మార్ట్ వ్యవసాయ పరికరాల ప్రయోజనాలను తెలుసుకున్నారు. ఈ టెక్నాలజీ నీటి సమర్థతను, దిగుబడిని పెంచి, వ్యాధుల ముందస్తు హెచ్చరికలు ఇస్తుందన్నారు.

News November 14, 2025

ప్రొద్దుటూరులో ఎగ్జిబిషన్ GST రూ.15.25 లక్షలు మాయం..!

image

ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ GSTకి సంబంధించిన భారీ నగదు లెక్కల్లో కనిపించడం లేదు. ఈ విషయాన్ని జీఎస్టీ అధికారులు గురువారం గుర్తించారు. 2021లో ఎగ్జిబిషన్‌కు సంబంధించి జీఎస్టీ రూ.15.25 లక్షలుగా నిర్ధారించారు. ఈ సొమ్మును చెల్లించామని మున్సిపల్ అధికారులు చెప్పగా.. ఆ డబ్బులు తమకు జమ కాలేదని GST అధికారులు అంటున్నారు. అసలు గుట్టు తేల్చడానికి జీఎస్టీ అధికారులు ఆడిట్‌కు సిద్ధమయ్యారు.

News November 13, 2025

కడప: ల్యాబ్‌లో సీతాకోకచిలుకల ఉత్పత్తి

image

కడప జిల్లాలోని వైవీయూ సరికొత్త ప్రయోగం చేపట్టింది. జంతుశాస్త్ర శాఖ ప్రయోగశాలలో క్యాపిటేటివ్ బ్రీడింగ్ ద్వారా సీతాకోక చిలుకలను ఉత్పత్తి చేసింది. వీటిని వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ గురువారం విడుదల చేశారు. ల్యాబ్ ద్వారా సీతాకోక చిలుకలను సృష్టించడం గొప్ప విషయమని కొనియాడారు. జువాలజి HOD డా.ఎస్పీ వెంకటరమణను పలువురు అభినందించారు. రిజిస్టర్ ప్రొ.పద్మ, డీన్ ప్రొ. ఏజీ దాము పాల్గొన్నారు.