News October 31, 2024

కడప నుంచి బెంగళూరు బయలుదేరిన జగన్

image

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కడప జిల్లాలో తన మూడు రోజుల పర్యటన ముగించుకొని బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. బెంగళూరు నుంచి రెండు రోజుల క్రితం హెలికాప్టర్‌లో ఇడుపులపాయ వెళ్లి అనంతరం పులివెందుల చేరుకున్నారు. మంగళ, బుధవారాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలను, ప్రతి ఒక్కరిని పులివెందులలోని తన నివాసంలో కలిశారు. క్యాడర్‌కు దిశానిర్దేశం చేసి గురువారం ఉదయం ఇడుపులపాయ చేరుకొని హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లారు.

Similar News

News November 26, 2025

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్ సంతకం

image

రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేశారు. పులివెందుల పర్యటనలో ఉన్న ఆయన బుధవారం కోటి సంతకాల సేకరణ ఫారంపై సంతకం చేసి తన వ్యతిరేకతను తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వైకాపా ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

News November 26, 2025

ప్రొద్దుటూరులో బంగారు ధరలు ఇలా..

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బంగారు ధరలు బుధవారం ఇలా ఉన్నాయి.
* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.12,590
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.11,583
* వెండి 10 గ్రాములు ధర రూ.1,630 గా ఉంది.
నిన్న, ఈరోజుకి బంగారు ధరలో ఎలాంటి మార్పు లేదు. కానీ నిన్న వెండి 10 గ్రాములు రూ.1,616 ఉండగా నేడు రూ.1630లకు పెరిగింది.

News November 26, 2025

కడప జిల్లాలో 201 మంది హౌసింగ్ ఉద్యోగులకు జీతాలు నిలిపివేత

image

కడప జిల్లాలో 201 మంది హౌసింగ్ ఉద్యోగులకు నవంబర్ నెల జీతాలు నిలిపివేస్తూ ఆ శాఖ ఎండీ అరుణ్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో ‘ఫేజ్-3’లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లోని లోపాలపై ఇటీవల పరిశీలన చేపట్టారు. ఈ నివేదిక ఆధారంగా జిల్లాలో 6,298 ఇళ్ల నిర్మాణాలకు అదనపు చెల్లింపు జరిగినట్లు గుర్తించారు. ఇందుకు 30 మంది ఏఈఎస్‌లు, 171 మంది ఈఏ/డబ్ల్యూఏఎస్‌లను బాధ్యులను చేస్తూ ఈ చర్యలు తీసుకున్నారు.