News October 31, 2024

కడప నుంచి బెంగళూరు బయలుదేరిన జగన్

image

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కడప జిల్లాలో తన మూడు రోజుల పర్యటన ముగించుకొని బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. బెంగళూరు నుంచి రెండు రోజుల క్రితం హెలికాప్టర్‌లో ఇడుపులపాయ వెళ్లి అనంతరం పులివెందుల చేరుకున్నారు. మంగళ, బుధవారాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలను, ప్రతి ఒక్కరిని పులివెందులలోని తన నివాసంలో కలిశారు. క్యాడర్‌కు దిశానిర్దేశం చేసి గురువారం ఉదయం ఇడుపులపాయ చేరుకొని హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లారు.

Similar News

News October 31, 2025

వచ్చేనెల 7న వైవీయూ అంతర కళాశాలల క్రీడల పోటీలు

image

నవంబరు 7న అంతర కళాశాలల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు వైవీయూ వ్యాయామ విద్య, క్రీడా శాస్త్రాల బోర్డు కార్యదర్శి డా.రామసుబ్బారెడ్డి గురువారం తెలిపారు. పురుషులు, మహిళలకు రోలర్ స్కెటింగ్, రైఫిల్ షూటింగ్, యోగా, టేబుల్ టెన్నిస్ పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు వారి ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్లపై ప్రిన్సిపల్‌తో అటెస్టేషన్ చేయించుకోవాలన్నారు. వయసు 17-25 ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొన్నారు.

News October 30, 2025

PGRS ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేయాలి: RDO

image

PGRS ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేయాలని కడప RDO జాన్ ఇర్విన్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. సిద్దవటం MRO కార్యాలయంలో గురువారం PGRSపై సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ప్రజా వేదికలో ఫిర్యాదు చేసిన ఫిర్యాదు దారులతో RDO చరవాణిలో మాట్లాడారు. అలాగే ఆయన గోల్డెన్ రికార్డ్స్, రీసర్వేపై సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు.

News October 30, 2025

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

కొండాపురంలోని పాత కొండాపురం సమీపంలో చిత్రావతి నది వంతెన సమీపంలో గురువారం రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. అతను రైలు కింద పడడంతో అతని తల, మొండెం రెండు భాగాలుగా విడిపోయాయి. మృతుడి ఒంటిపై పసుపు కలర్ చొక్కా, బ్లూ కలర్ పాయింట్ ఉన్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.