News January 2, 2025

కడప పట్టణాన్ని నిర్మించిన రాజు మీకు తెలుసా?

image

దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీనమైన పట్టణాలలో కడప పట్టణం ఒకటి. పెన్నా నది ఒడ్డున మొదటి కడప పట్టణాన్ని తమిళ రాజు కరికాల చోళుడు నిర్మించినట్లు తమిళ సంఘ సాహిత్యంలోని తల్కాపియం అనే గ్రంథం ఆధారంగా తెలుస్తుంది. కరికాల చోళుని పేరు మీదనే కడప అనే పేరు వచ్చింది. అప్పటి జిల్లా ప్రధాన పరిపాలనా కేంద్రం సిద్ధపటం కోట. ఈ కోట కూడా పెన్నా నది ఒడ్డునే ఉండడం విశేషం. కంచి ఏకాంబరేశ్వరబాబు ఆలయంలో వీరి విగ్రహం ఉంది.

Similar News

News September 19, 2025

కడప: ఉల్లి రైతులకు శుభవార్త

image

ఉల్లి సాగు చేసిన రైతులంతా తమ పంటను రైతు బజార్లు, మార్కెట్ యార్డుల్లో విక్రయించుకోవచ్చని, ఎటువంటి గుర్తింపు కార్డులు చూపాల్సిన అవసరం లేదని కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ స్పష్టం చేశారు. కిలో రూ.12 చొప్పున రైతులు ఉల్లిని విక్రయించాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

News September 19, 2025

కడప: పోలీసుల అదుపులో ఎర్రచందనం స్మగ్లర్లు..!

image

తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎర్రచందనం కూలీలను కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసులు అదుపులోకి తీసుకునట్లు తెలుస్తోంది. మండలంలోని పెద్ద శెట్టిపల్లి వద్ద ఎర్రచందనం తరలించేందుకు వెళ్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. 15 మంది కూలీలను అదుపులోకి తీసుకుంటూ సమాచారం. వీరి వెనుక ఉన్న ప్రధాన స్మగ్లర్ ఎవరనే దానిపై కడపకు తరలించి విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

News September 19, 2025

22 నుంచి కడపలో డిగ్రీ కాలేజీల బంద్..!

image

ఫీజు బకాయిల విడుదల కోసం డిగ్రీ విద్యా సంస్థలు బంద్ చేయాలని వైవీయూ డిగ్రీ కాలేజీ ప్రైవేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నిర్ణయించింది. అసోసియేషన్ కార్యదర్శి శ్రీను మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై చర్చ జరపాలన్నారు. ఫీజులు రాక కళాశాలలు నడిపేందుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈనెల 22 నుంచి బంద్ చేస్తామంటూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పద్మకు బంద్ నోటీసులు ఇచ్చారు.