News November 18, 2024

కడప: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) వికేంద్రీకరణ

image

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)ను ఈ సోమవారం నుంచి మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలలోనే ఇవ్వాలని సూచించారు.

Similar News

News March 17, 2026

కడప: రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం

image

కడప జిల్లాలోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థ పాలకవర్గ సభ్యుల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. బుధవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు కొనసాగనున్నాయి. కడప నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా జిల్లా జేసీ నిధి మీనా బాధ్యతలు చేపట్టనున్నారు.

News March 17, 2026

కడప: నేటి ఇంటర్ పరీక్షలకు 12,781 మంది విద్యార్థులు హాజరు.!

image

కడప జిల్లాలో మంగళవారం 60 సెంటర్లలో ఇంటర్ ఫస్టియర్ ఫిజిక్స్ పేపర్-1 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఎస్పీ ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. నేటి పరీక్షలకు 13,156 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 12,781 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షలు రాశారు. 375 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు.

News March 17, 2026

ఎంపీ అవినాష్ వ్యాఖ్యలపై భూపేశ్ రెడ్డి కౌంటర్

image

వివేక్ కుమార్తె సునీతను అడ్డం పెట్టుకొని టీడీపీ లబ్ధి పొందాలని చూస్తుందని ఎంపీ అవినాశ్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారని మీ మాయ మాటలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. 11 సీట్లు వచ్చినా బుద్ధి మారలేదని, దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. వివేకాను హత్య చేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసని అన్నారు.