News December 2, 2024
కడప: ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

రేపు జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని (గ్రీవెన్సు) తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కడప జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తుఫాన్ కారణంగా సోమవారం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశమున్నందున కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు గమనించాలని కోరారు.
Similar News
News January 6, 2026
కడప: 4,416 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ

కడప జిల్లాలో ప్రభుత్వం సివిల్ సప్లైస్ శాఖ ద్వారా రైతుల వద్ద నుంచి గిట్టుబాటు ధరతో ఖరీఫ్ సీజన్లో 4,416.360 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసింది. డిసెంబర్ నెలలో 21 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. వ్యవసాయ శాఖ సిబ్బంది, DCMSల ద్వారా జిల్లాలో 698 మంది రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేపట్టింది. క్వింటాకు రూ.2369 గిట్టుబాటు ధర ధర కల్పించింది. ఈ సేకరణలో చాపాడు మండలం మొదటి స్థానంలో నిలిచింది.
News January 5, 2026
కడప పోలీస్ గ్రీవెన్స్కు 81 అర్జీలు

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో SP నచికేత్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, ఆయనకు తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ సమస్య ఉన్నా తమదృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని అప్పటికప్పుడు సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరించాలని సూచించారు.
News January 5, 2026
కడప పోలీస్ గ్రీవెన్స్కు 81 అర్జీలు

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో SP నచికేత్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, ఆయనకు తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ సమస్య ఉన్నా తమదృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని అప్పటికప్పుడు సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరించాలని సూచించారు.


