News February 19, 2025

కడప: ‘ప్రాజెక్టులను విస్మరిస్తే ఉద్యమమే’

image

నీటిపారుదల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో రాయలసీమను విస్మరిస్తే ఉద్యమం తప్పదని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కెఆర్‌ఎంబి కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరయ్య అన్నారు. ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు కడపలో జరుగు ప్రాజెక్టుల ప్రాంతీయ సదస్సు ఉద్యమ కార్యాచరణకు వేదిక కానుందని తెలిపారు. కడపలో జరుగు ప్రాజెక్టుల ప్రాంతీయ మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News February 22, 2025

రాజంపేట ఎమ్మెల్యేకు నోటీసులు

image

ఉమ్మడి కడప జిల్లా MLA ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ నోటీసులు పంపారు. మందపల్లి, ఆకేపాడు గ్రామాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూముల అక్రమణ ఆరోపణలపై రాజంపేట MLA, ఆయన కుటుంబ సభ్యులు నేడు హాజరై వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రభుత్వ భూములను, వైసీపీ ప్రభుత్వం హయాంలో దాన విక్రయం కింద బదలాయించుకుని, అందులో ఎస్టేట్ నిర్మించుకున్నారని సుబ్బనరసయ్య ఫిర్యాదు చేశాడు.

News February 22, 2025

కడప జిల్లాలో టమాటా రైతులకు శుభవార్త

image

కడప జిల్లాలో టమాట రైతులు పంట పండించి ఎలాంటి గుర్తింపుకార్డు లేకపోయినా రైతు బజార్లో సరుకు అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతించినట్లు కలెక్టర్ శ్రీధర్, జేసీ అతిథి సింగ్ తెలిపారు. కూరగాయల పంట సీజన్ కావడంతో అధిక దిగుబడి వచ్చిందని, గ్రామాల్లో ధర లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు రైతుబజార్ ఎస్టేట్ ఆఫీసర్‌ను సంప్రదించవచ్చన్నారు.

News February 21, 2025

భాష ఆగితే జాతి మరణిస్తుంది: తులసి రెడ్డి

image

శ్వాస ఆగితే మనిషి, భాష ఆగితే జాతి మరణిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డా.తులసి రెడ్డి అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవాన్ని వేంపల్లిలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. వేంపల్లి తల్లిశెట్టి సుబ్రహ్మణ్యం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన తెలుగు పండితులు ధర్మా రెడ్డి ,కృష్ణవేణి, పద్మజ తదితరులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

error: Content is protected !!