News July 25, 2024
కడప: బయోటెక్నాలజీలో షేక్ సమీనకు YVU డాక్టరేట్

YVU బయోటెక్నాలజీ శాఖ స్కాలర్ షేక్ సమీనకు డాక్టరేట్ ప్రదానం చేసింది. ప్రొఫెసర్ ఎ. చంద్రశేఖర్ పర్యవేక్షణలో “నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ పద్దతిని ఉపయోగించి, కొర్రలలో దిగుబడిని పెంచేందుకు రికాంభినెంట్ ఇనెబ్రీడ్ లైన్స్ని అభివృద్ధి చేశారు. ఈ రీసెర్చ్ భారతదేశంలో మొదట ఆధునిక జీనోమ్ ఆధారిత పరిశోధన కావడం విశేషం. ఈ పరిశోధనకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు వైవీయూ సీఈ ప్రొ. ఎన్. ఈశ్వర రెడ్డి తెలిపారు.
Similar News
News December 5, 2025
కడపలో ఆచూకీ లేని 51వేల రేషన్ కార్డుదారులు..!

కడప జిల్లాలో 51,961 మంది రేషన్ కార్డుదారుల ఆచూకీ లేదు. దీంతో వారికి పంపిణీ చేయాల్సిన కార్డులు మిగిలిపోయాయి. జిల్లాకు 5,73,675 స్మార్ట్ కార్డులు రాగా వీటిలో 5,21,714 కార్డులు మాత్రమే పంపిణీ చేశారు. కడపలో 15,732, బద్వేల్లో 12,223, జమ్మలమడుగులో 18,906, పులివెందుల డివిజన్లో 5,100 కార్డులు మిగిలిపోయాయి. కార్డుల్లో ఉన్న అడ్రస్సుల్లో లబ్ధిదారులు లేకపోవడంతో వాటిని అధికారులు పంపిణీ చేయలేదు.
News December 5, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

ప్రొద్దుటూరులో శుక్రవారం బంగారం, వెండి ధరల వివరాలు:
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.12785.00
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.11,762.00
*వెండి 10 గ్రాములు రేట్: రూ.1780.00
News December 5, 2025
కడప రిమ్స్ సేవలు నిరాశపరుస్తున్నాయి!

కడప రిమ్స్ సేవలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘రిమ్స్ సేవలపై మీ అభిప్రాయమేంటి?’ అంటూ Way2Newsలో పబ్లిష్ అయిన <<18460527>>వార్తకు<<>> భారీ స్పందన లభించింది. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని, రెఫరెన్స్తో సేవలు త్వరగా అందుతాయని, కొన్ని సేవలకు లంచం ఇవ్వాలని, కొందరు వైద్యులు, నర్సులు కఠినంగా మాట్లాడతారని కామెంట్ల రూపంలో ఎండగట్టారు. ఎమర్జెన్సీ, కాన్పుల వార్డులో సేవలు బాగున్నాయని కితాబిచ్చారు.


