News June 19, 2024

కడప: బస్సు ప్రమాదాల్లో 8మంది మృతి

image

కడప జిల్లాలో అద్దె ఆర్టీసీ బస్సులతో తరచూ ప్రాణాలు పోతున్నాయి. ఈ నెల 16వ తేదీన కడప శివారులో స్కూటీని ఢీకొనగా ఇద్దరు మృతి చెందారు. మరుసటి రోజే కడప డిపోకు చెందిన అద్దె ఆర్టీసీ, కారును ఢీకొనగా మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. మొత్తంగా చూసుకుంటే 2024 జనవరి నుంచి జూన్17 వరకు ఎనిమిది ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురవ్వగా …ఎనిమిది మంది మృతి చెందగా పలువురు గాయాల పాలయ్యారు.

Similar News

News January 7, 2026

కడప జిల్లాలో 18 మంది SIల బదిలీలు

image

కడప జిల్లాలో ఎస్సైలను భారీగా బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా 18 మంది ఎస్ఐలను బదిలీ చేశారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో రిపోర్టు చేయాలంటూ ఆయన ఆదేశించారు. ప్రొద్దుటూరు, కడప, బద్వేలు, మైదుకూరు ప్రాంతాల్లో దాదాపు SIలకు స్థాన చలనం కల్పించారు.

News January 7, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,110
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.12,981
* వెండి 10 గ్రాములు ధర రూ.2,520.

News January 7, 2026

BREAKING: ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు క్వాలిఫై అయిన ఏపీ టీమ్

image

69వ జాతీయ U-14 బాలికల వాలీబాల్ టోర్నమెంట్లో ఏపీ టీమ్ సత్తా చాటుతోంది. ఇవాళ గోవాపై గెలిచి ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. జమ్మలమడుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ పోటీలు జరుగుతున్నాయి. వరుసగా మూడు సెట్లలో ఆధిపత్యం కనబరిచి మరో 2 సెట్లు ఉండగానే విజయం సాధించింది. దీంతో వారిని పలువురు అభినందిస్తున్నారు. రేపు జరిగే ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో విజయం సాధిస్తే క్వార్టర్ ఫైనల్‌కు చేరుతుంది.