News April 8, 2025
కడప: ‘మహానాడును విజయవంతం చెయ్యండి’

మహానాడును విజయవంతం చేసేందుకు సమన్వయంతో పని చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. సోమవారం కడప నగరంలో వివిధ చోట్ల మహానాడు ఏర్పాటుకు స్థలాలను పరిశీలించారు. జిల్లాలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు సమన్వయంతో పనిచేసి, కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యలని సూచించారు.
Similar News
News April 17, 2025
అధికార యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు: కడప కలెక్టర్

ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను ప్రణాళికాబద్ధంగా, బాధ్యతాయుతంగా, నిబద్ధతతో కళ్యాణ ఘట్టాన్ని అంగరంగ వైభవంగా విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా అధికార యంత్రాంగానికి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ అశోక్ కుమార్ అభినందనలు తెలిపారు. ఈరోజు సాయంత్రం కలెక్టర్ క్యాంప్ కార్యాలయ ఆవరణంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.
News April 16, 2025
రెవెన్యూ సేవల్లో వేగం, నాణ్యత ముఖ్యం: కలెక్టర్

రెవెన్యూ అధికారులు అన్ని రకాల ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు), చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. బుధవారం కడప కలెక్టరేట్లోని సభా భవనంలో వివిధ రెవెన్యూ అంశాలపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. రెవెన్యూ సేవల్లో వేగం, నాణ్యత ముఖ్యం అన్నారు. అధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకుని, మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు.
News April 16, 2025
అట్లూరు: ఈతకు వెళ్లి బాలిక మృతి

అట్లూరు మండలం కమలకురులో ఈతకు వెళ్లి 15 ఏళ్ల తేజ మృతి చెందిన విషయం తెలిసిందే. తేజ నడుముకు కట్టుకున్న ప్లాస్టిక్ వస్తువు జారిపోవడంతో నీటిలో కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. బాలిక తండ్రి జీవనోపాధి కోసం కువైట్కు వెళ్లారు. పాప మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.