News August 6, 2024
కడప: మాజీ ఎమ్మెల్యేలకు ఊరట

కమలాపురంలో రైలు రోకో కోసం చేసిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, రఘురామిరెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ దుగ్గాయ పల్లి మల్లికార్జున్ రెడ్డి, సలహాదారుడు సంబుటూరు ప్రసాద్ రెడ్డిపై నమోదైన కేసును మంగళవారం విజయవాడలోని వీఐపీ కోర్టు కొట్టివేసింది. 2022లో కమలాపురంలో అన్ని రైలు ఆపాలని అప్పటి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రైలు రోకో చేపట్టారు. దీనిపై రైల్వే అధికారులు వీరిపై కేసు నమోదు చేశారు.
Similar News
News December 4, 2025
11వ తేదీ కడప మేయర్ ఎన్నిక జరగకపోతే?

కడప మేయర్ ఎన్నికకు <<18470673>>నోటిఫికేషన్<<>> విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహిస్తున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని పేర్కొన్నారు. ఒకవేళ 11వ తేదీ ఎన్నిక జరగకపోతే.. రిజర్వ్ డే (12వ తేది)న ఎన్నిక ఉంటుందని స్పష్టం చేశారు. అప్పటికీ ఎన్నిక జరగకుంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ తర్వాతి తేదీని వెల్లడిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News December 4, 2025
BREAKING: కడప మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

కడపలో ఖాళీగా ఉన్న మేయర్ స్థానానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నూతన మేయర్ను ఎన్నుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పూర్వపు మేయర్ సురేశ్ బాబుపై ప్రభుత్వం అనర్హత వేటు వేయడంతో ఇన్ఛార్జ్ మేయర్గా ముంతాజ్ కొనసాగుతున్నారు. కడపలో మొత్తం 50 వార్డులు ఉన్నాయి.
News December 4, 2025
కడప జిల్లాలో రియల్ ఎస్టేట్ ఢమాల్.!

కడప జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గింది. జిల్లాలో 12 SROలు ఉన్నాయి. వీటి ద్వారా 2025-26లో రూ.411.74 కోట్లు టార్గెట్ కాగా.. నవంబరు నాటికి రూ.181.73 కోట్లు మాత్రమే వచ్చింది. బద్వేల్-9.48, జమ్మలమడుగు-10.37, కమలాపురం-8.60, ప్రొద్దుటూరు-40.47, మైదుకూరు-7.10, ముద్దనూరు-3.44, పులివెందుల-11.96, సిద్దవటం-2.45, వేంపల్లె-6.14, దువ్వూరు-2.55, కడప-79.13 కోట్లు వచ్చింది.


