News August 8, 2024

కడప మీదుగా వెలంకణ్ణికి ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ముంబైలోని బాంద్రా టెర్మినల్ నుంచి వెలంకణ్ణికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ ప్రకటనలో తెలిపారు. బాంద్రా టెర్మినల్ నుంచి ఆగస్టు 27, సెప్టెంబర్ 6, తిరుగు ప్రయాణంలో వెలంకణ్ణి నుంచి 29 ఆగస్టు, సెప్టెంబర్ 8 తేదీలలో పుణే, గుంతకల్, కడప, రేణిగుంట, విల్లుపురం మీదుగా ప్రయాణిస్తుందని ఆయన తెలిపారు.

Similar News

News January 7, 2026

మైలవరం: వేరు వేరు చోట ఇద్దరు ఆత్మహత్య

image

మైలవరం మండలంలో మంగళవారం ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వద్దిరాలలో దేవ (22) అనే యువకుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇతనికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అలాగే దొమ్మర నంద్యాలకు చెందిన షేక్ నూర్జహాన్ (20) అనే వివాహిత కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ రెండు ఘటనలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News January 7, 2026

కడప: మీ నోడల్ అధికారి వీరే.!

image

ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం కోసం ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక నోడల్ అధికారిని నియమించింది. వారి వివరాలు ఇలా ఉన్నాయి.
➤ కడప- కమిషనర్ మనోజ్ రెడ్డి
➤ జమ్మలమడుగు- RDO సాయి శ్రీ
➤ ప్రొద్దుటూరు- ZP CEO ఓబులమ్మ
➤ పులివెందుల- PD DRDA రాజ్యలక్ష్మి
➤ మైదుకూరు- డ్వామా PD ఆదిశేషారెడ్డి
➤ బద్వేల్‌- RDO చంద్రమోహన్
➤ రాజంపేట- సబ్ కలెక్టర్ భావన
➤ కమలాపురం- కడప RDO జాన్ ఇర్విన్.

News January 7, 2026

కడప జిల్లాలో ఉల్లి రైతులకు రూ.28.40 కోట్ల సాయం.!

image

కడప జిల్లాలో 7298 మంది ఉల్లి రైతులకు 14,203.31 ఎకరాలకు రూ.28.40 కోట్లు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది.
*కమలాపురం 2526 మందికి రూ.11.32 కోట్లు
*మైదుకూరు 2352 మందికి రూ.7.74 కోట్లు
*పులివెందుల 1590 మందికి రూ.6.17 కోట్లు
*జమ్మలమడుగు 742 మందికి రూ.2.99 కోట్లు
*బద్వేల్ 67మందికి రూ.14.92 లక్షలు
*రాజంపేట 18మందికి రూ.2.33 లక్షలు
*కడప ఇద్దరికి రూ.35,900
*ప్రొద్దుటూరులో ఒకరికి రూ.20.60 వేలు.