News May 22, 2024
కడప: మొదటి కౌంటింగ్ కమలాపురం నుంచే?

జూన్ 4న జరగనున్న జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ కు ప్రతి నియోజకవర్గంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. కమలాపురం నియోజకవర్గంలో 18 రౌండ్లు, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో 20 రౌండ్లు, కడపలో 21 రౌండ్లు, పులివెందులలో 22, జమ్మలమడుగులో 23 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి అవుతుంది. దీంతో కమలాపురం ఫలితం మొదటగా, జమ్మలమడుగు ఫలితం చివరగా వెలువడే అవకాశాలు ఉన్నాయి.
Similar News
News October 19, 2025
బద్వేల్ నియోజకవర్గంపై టీడీపీ స్పెషల్ ఫోకస్

బద్వేల్పై TDP అధిష్ఠానం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇన్ఛార్జ్ విషయంలో నియోజకవర్గంలోని ప్రజలకు IVRS కాల్స్ చేసి అభిప్రాయాలను తెలుసుకుంది. ఇందులో ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్న రితీశ్ రెడ్డి, DCC బ్యాంక్ ఛైర్మన్ సూర్యనారాయణ రెడ్డి పేర్లను పేర్కొంది. బద్వేలులో ఎవరైనా నాయకుడిగా ఎదిగారంటే అది వీరారెడ్డి కుటుంబం దయేనని, రితీశ్ రెడ్డే తమ నాయకుడు అని పలువురు TDP నేతలు ప్రెస్ మీట్లు పెట్టారు.
News October 19, 2025
కడప: తాళ్ల పొద్దుటూరు ఎస్సై సస్పెండ్

కడప జిల్లాలో మరో ఎస్సై సస్పెండ్ అయ్యారు. విచ్చలవిడి అవినీతి, ప్రవర్తన సరిగ్గా లేవనే ఆరోపణలతో పెండ్లిమర్రి ఎస్సై <<18044279>>మధుసూధర్ రెడ్డిని<<>> సస్పెండ్ చేస్తూ డీఐజీ కోయా ప్రవీణ్ ఉత్తర్వులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇదే రీతిలోనే తాళ్ల ప్రొద్దుటూరు ఎస్సై హృషికేశవరెడ్డిపై కూడా ఆరోపణలు రావడంతో ఆయనని కూడా సస్పెండ్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.
News October 19, 2025
పెండ్లిమర్రి ఎస్సై మధుసూదన్ రెడ్డిపై వేటు

పెండ్లిమర్రి ఎస్సై మధుసూదన్ రెడ్డిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయనను సస్పెండ్ చేస్తూ కర్నూలు రేంజి డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల అతడిపై అనేక అవినీతి ఆరోపణలు రావడం, ఇతని ప్రవర్తనపై కూడా పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.