News August 6, 2024

కడప: రసవత్తరంగా జరుగుతున్న క్రికెట్ పోటీలు

image

జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్‌ – 19 గ్రూప్‌ -బి జిల్లాల క్రికెట్‌ టోర్నమెంట్‌ 91.1 ఓవర్లలో 347 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. జట్టులోని ఆర్‌. రోహిత్‌ 76, చేతన్‌ రెడ్డి 72, గురు చరన్‌ 70, ప్రణవ్‌ కుమార్‌ రెడ్డి 66 పరుగులు చేశారు. బ్యాటింగ్‌కు దిగిన నెల్లూరు జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 6 పరుగులు చేసింది.

Similar News

News November 16, 2025

కడప జిల్లాలో పలువురు సీఐల బదిలీలు.!

image

కడప జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ DIG కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. పోరుమామిళ్ల CI శ్రీనివాసులను రైల్వే కోడూరుకు, రైల్వే కోడూరు CI హేమసుందర్ రావును పోరుమామిళ్లకు బదిలీ చేశారు. ఒంటిమిట్ట CI బాబును అన్నమయ్య జిల్లాకు, చిత్తూరు‌ VRలో ఉన్న నరసింహరాజు ఒంటిమిట్టకు బదిలీ అయ్యారు. ట్రాఫిక్ CI జావేద్ కడప జిల్లా సైబర్ క్రైమ్ సీఐగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో సురేశ్ రెడ్డి రానున్నారు.

News November 16, 2025

రేపు కడప కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

image

కడప నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఉంటుందని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. ఉదయం జరిగే కార్యక్రమానికి కలెక్టర్ శ్రీధర్, జాయింట్ అధితి సింగ్‌తో సహా జిల్లాలోని ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. అర్జీ దారులు తమ సమస్యలను ఉన్నతాధికారాల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు.

News November 15, 2025

పంటల రక్షణకు IOT సాంకేతికత అవసరం: కలెక్టర్

image

కడప కలెక్టరేట్‌లో మైక్రో ఇరిగేషన్, ఉద్యాన పంటల సస్యరక్షణపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ సమీక్ష నిర్వహించారు. వాతావరణ మార్పుల పర్యవేక్షణకు నూతన సాంకేతిక పరిజ్ఞానం మేళవింపు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. క్రాపిన్, ఫసల్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. ఐఓటీ ఆధారిత స్మార్ట్ వ్యవసాయ పరికరాల ప్రయోజనాలను తెలుసుకున్నారు. ఈ టెక్నాలజీ నీటి సమర్థతను, దిగుబడిని పెంచి, వ్యాధుల ముందస్తు హెచ్చరికలు ఇస్తుందన్నారు.