News April 6, 2024

కడప: రెండో రోజు కొనసాగనున్న షర్మిల బస్సు యాత్ర

image

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బస్సు యాత్ర రెండో రోజు జిల్లాలో కొనసాగనుంది. బద్వేల్‌, అట్లూరు, కడప నియోజకవర్గాల్లో శనివారం యాత్ర జరుగనుంది. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే బస్సు యాత్రలో పీసీసీ మీడియా ఛైర్మన్‌ ఎన్‌.తులసిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గుండ్లకుంట శ్రీరాములు పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. వీరితో పాటు ఆయా నియోజకవర్గ నేతలు పాల్గొంటారు.

Similar News

News December 4, 2025

కడప: ప్రైవేట్ ఆస్పత్రుల అనుమతులపై ఆరా.!

image

కడప జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రుల అనుమతులపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రొద్దుటూరులో ప్రభుత్వ యాజమాన్యంలో జిల్లా ఆస్పత్రి, 6 అర్బన్ హెల్త్ సెంటర్లు, యునాని, హోమియో, ఆయుర్వేదం ఆస్పత్రులు ఉన్నాయి. ప్రైవేట్ యాజమాన్యంలో 108 అల్లోపతి, 30 డెంటల్, 10 పిజియో థెరపీ, 8 హోమియో, 4 ఆయుర్వేదం ఆసుపత్రులు ఉన్నాయి. 38 డయాగ్నస్టిక్ స్కానింగ్ కేంద్రాలు, 13 ల్యాబ్‌లు ఉన్నాయి.

News December 4, 2025

ముద్దనూరు: వైసీపీ ఎన్నారై విభాగం ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్

image

వైసీపీ ఎన్నారై విభాగం ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ చింత ప్రదీప్ ఎంపికయ్యారు. ఈయన ముద్దనూరు మండల పరిధిలోని రాజు గురువాయిపల్లికి చెందిన వ్యక్తి. బుధవారం సాయంత్రం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రదీప్‌ను నియమించినట్లు తెలిపారు. పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తానని ప్రదీప్ పేర్కొన్నారు.

News December 3, 2025

కడప: రైలులో లైంగిక దాడి.. నిందితుడికి జీవిత ఖైదు

image

రైలులో చిన్నారిపై లైంగిక దాడి కేసులో బుధవారం కడప పోక్సో కోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. నిందితుడు రామ్ ప్రసాద్ రెడ్డికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. బాధితురాలికి రూ.10.50 లక్షల పరిహారం చెల్లించాలని గుంతకల్ డీఆర్ఎంను ఆదేశించారు. విధుల్లో ఉన్న టీటీఐలపై చర్యలకు సిఫార్సు చేశారు. శిక్ష పడేలా కృషి చేసిన రైల్వే హెడ్ కానిస్టేబుల్ నాగరాజును, పీపీలను ప్రశంసించారు.